హైదరాబాద్: చిన్నారి పై లైంగిక దాడి.. స్కూలు గుర్తింపు రద్దు..
- October 21, 2022
హైదరాబాద్: హైదరాబాద్లో లైంగికి దాడికి గురైన చిన్నారి చదువుతున్న డీఏవీ స్కూలు గుర్తింపును వెంటనే రద్దు చేయాలని సూచిస్తూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆదేశించారు. ఈ అంశంపై హైదరాబాద్ డీఈవోకు మంత్రి సబిత ఆదేశాలు జారీ చేశారు.
అలాగే ప్రస్తుతం ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు నష్టపోకుండా, మిగతా పాఠశాలల్లో సీట్లు కేటాయించేలా చూడాలని కూడా ఆమె సూచించారు. ఈ విషయంలో విద్యార్థుల సందేహాల్ని తొలగించి, ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు తిరిగి జరగకుండా చూడాలని ఆమె ఆదేశించారు. పాఠశాలల్లో భద్రతాపరమైన చర్యలపై ప్రభుత్వానికి సూచనలు చేసేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యాశాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సబిత ప్రకటించారు. ఈ కమిటీ వారం రోజుల్లోగా తన నివేదిక అందజేస్తుందని, ఈ నివేదిక ఆధారంగా విద్యార్థుల భద్రతకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు ఆమె వెల్లడించారు.
ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన ప్రిన్సిపల్ వాహన డ్రైవర్ రజనీ కుమార్ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. తాజాగా స్కూలు ప్రిన్సిపల్ మాధవిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన డ్రైవర్ ఆకృత్యానికి పాల్పడుతున్నా అడ్డుకోకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఘటన జరగడానికి కారణమయ్యారనే ఆరోపణలపై ఆమెపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!







