తానూ చేసిన కంమేంట్ల పై క్షమాపణ కోరిన ఆర్ బి ఐ గవర్నర్
- April 20, 2016
భారతదేశం యొక్క వృద్ధి రేటు 'ఒంటి కన్ను రాజు' తో పోల్చిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంతో ఆర్ బీఐ గవర్నర్ రఘు రామ్ రాజన్ క్షమాపణలు చెప్పారు. తన మాటలు ఎవరినైనా బాధపెట్టి వుంటే క్షమించాలని ఆయన కోరారు. తాను అలాంటి పోలిక చేసి ఉండాల్సింది కాదని అన్నారు. ఈ విషయంలో ప్రజల మనోభావాలను, ముఖ్యంగా అంధులను గాయపర్చినందుకు మన్నించాల్సిందిగా కోరారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ సంక్షోభంలా ఉండగా మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి గురించి చెప్పేందుకు అలా మాట్లాడాననని రాజన్ తెలిపారు. తన వ్యాఖ్యలతో జనాభాలోని ఒక వర్గం(అంధులు) వారిని గాయపర్చినందుకు క్షమించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
ఆర్ బీఐ గవర్నర్ వ్యాఖ్యలపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర వాణిజ్యమంత్రి నిర్మలా సీతారామన్ , సహాయమంత్రి జయంత్ సిన్హా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన అలాంటి పదాలు వాడడం విచారకరమని నిర్మల వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ షైనింగ్ స్టార్ లా ఉందంటూ రాజన్ వ్యాఖ్యలను జయంత్ సిన్హా తప్పుబట్టారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









