ట్రాఫిక్ పర్యవేక్షణకు డ్రోన్ల వినియోగం.. పెరిగిన నిఘా
- October 22, 2022
యూఏఈ: అజ్మాన్ పోలీసుల కోసం ఎయిర్ సపోర్ట్ సెంటర్ ఒక సంవత్సరం నుండి భద్రతను మెరుగుపరచడానికి, క్షేత్ర స్థాయిలో ట్రాఫిక్ను పర్యవేక్షణకు డ్రోన్లను ఉపయోగిస్తోంది. ఇప్పటివరకు 20 భద్రత-నిఘా మిషన్లు, 299 ట్రాఫిక్ మిషన్లు, 13,598 నిమిషాల పాటు డ్రోన్ ఎయిర్ కార్యకలాపాలను నిర్వహించినట్లు ఎయిర్ సపోర్ట్ సెంటర్ కెప్టెన్ రషీద్ అల్ అత్తర్ పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ని షేర్ చేశారు. ట్రాఫిక్ జామ్లకు గల కారణాలను తెలుసుకోవడంతోపాటు భద్రతా అధికారులకు డ్రోన్స్ ఆపరేషన్స్ సహాయపడుతుందన్నారు. ప్రమాదాల కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడితే, దాని తీవ్రతను అర్థం చేసుకోవడానికి డ్రోన్స్ విజువల్స్ ఉపయోగపడతాయని వివరించారు. ఈ డ్రోన్లకు అత్యాధునిక సాంకేతికతతో కూడిన కెమెరాలు అమర్చబడి ఉంటాయని, అవి 1,000 మీటర్ల దూరంలో ఉన్న చిత్రాలను స్పష్టంగా తీయగలవన్నారు. వాహానాల నంబర్ ప్లేట్ను గుర్తించగలవన్నారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







