వైట్ హౌస్ లో ఘనంగా దీపావళి వేడుకలు
- October 25, 2022
వాషింగ్టన్: అమెరికా వైట్ హౌస్ లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి, ప్రథమ మహిళ జిల్ బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలాహారిస్ పాల్గొన్నారు. దీపాలను వెలిగించి బైడెన్ వేడుకలను ప్రారంభించారు. బైడెన్ మాట్లాడుతూ.. అమెరికా సంస్కృతిలో దీపావళిని చేర్చినందుకు భారత సంతతికి, దేశంలో ఉన్న భారతీయులకు ధన్యవాదాలు తెలిపారు. దీపావళి సందర్భంగా విందు ఇవ్వడం తనకు గర్వకారణమని బైడెన్ చెప్పారు.
ఈ వేడుకల్లో సుమారు 200 మందికిపైగా భారతీయ అమెరికన్లు పాల్గొన్నారు. యూఎస్లో ఉన్న భారతీయులకు బైడెన్, కమలాహారిస్ దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. ప్రవాస భారతీయులకు కమలాహారిస్ ధన్యవాదాలు తెలిపారు. ‘ఈ వైట్హౌస్ ప్రజల ఇల్లు, మా అధ్యక్షురాలు, ప్రథమ మహిళ జిల్ బైడెన్తో కలిసి సంప్రదాయ వేడుకను నిర్వహించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని కమలాహారిస్ అన్నారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







