కీలక మ్యాచ్లో విండీస్పై భారత్ ఘన విజయం..
- March 01, 2026
సెమీస్ లోకి వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ అదరగొట్టింది.విండీస్ పై ఘనవిజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో విండీస్ ను చిత్తు చేసింది.ఈ గెలుపుతో సెమీ ఫైనల్ లోకి దూసుకెళ్లింది భారత్. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.196 పరుగుల టార్గెట్ ను భారత్ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేదించింది. ఓపెనర్ సంజూ శాంసన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.చివరి వరకు క్రీజులో ఉండి భారత్ ను గెలిపించాడు. సంజూ 50 బంతుల్లో 97 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
డూ ఆర్ డై మ్యాచ్ లో సంజూ శాంసన్ అద్భుతంగా ఆడాడు. ఓ ఎండ్ లో వికెట్లు పడ్డా.. మరో ఎండ్ లో ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అభిషేక్ శర్మ(10), ఇషాన్ కిషన్ (10) లు తక్కువ పరుగులకే ఔట్ అయినా.. సంజా మాత్రం దూకుడు ప్రదర్శించాడు. వరుసగా బౌండరీలు బాదాడు. ఈ క్రమంలో 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత చివరి వరకు క్రీజులో ఉండి భారత్ కు ఘన విజయాన్ని అందించాడు.
ఈ నెల 5న ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగే సెమీఫైనల్-2 లో ఇంగ్లండ్, భారత్ తలపడనున్నాయి. ఈ నెల 8న ఫైనల్ జరగనుంది.
తాజా వార్తలు
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన
- పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి
- ఫేక్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ల పై అబుదాబి పోలీసులు హెచ్చరిక..!!









