ఎన్నారైలకు ఐసీఐసీఐ బ్యాంక్ కీలక ప్రకటన
- October 25, 2022
ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంక్ ఐసీఐసీఐ(ICICI) తాజాగా కీలక ప్రకటన చేసింది.ఎన్నారై సేవింగ్స్ అకౌంట్స్కు సంబంధించి సర్వీస్ చార్జీలు పెంచుతున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. నవంబర్ 1 నుంచి సవరించిన చార్జీలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. అంతేకాకుండా.. చెక్కు ద్వారా జరిగే లావాదేవీలకు సంబంధించిన పెనాల్టీను కూడా పెంచుతున్నట్టు చెప్పింది. క్యాష్ డిపాజిట్లు, బ్యాంక్ సేట్మెంట్, పాస్బుక్ సంబంధించి డూప్లికేట్ సర్టిఫికేట్ల జారీ, తదితర సేవలన్నిటికీ చార్జీలు పెంచుతున్నట్టు పేర్కొంది.
ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో బ్యాంకు రూ.7558 కోట్ల నికర లాభాలను ఆర్జించింది.గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది దాదాపు 33 శాతం అధికం. ఇక బ్యాంకు నికర ఆదాయం 26 శాతం పెరగ్గా, ప్రాఫిట్ మార్జిన్ 4.31 శాతం మేర పెరిగింది. దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన ఐసీఐసీఐకి ప్రస్తుతం 5,614 బ్రాంచ్లు ఉన్నాయి. మొత్తం 13,254 ఏటీఎంల నెట్వర్క్ కూడా ఉంది. ఇక ఐసీఐసీఐ బ్యాంకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో సభ్యుడిగా సందీప్ బక్షీని మరోసారి నియమించినట్టు బ్యాంకు సెబీకి ఇచ్చిన వివరాల్లో తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈ ప్రైవేట్ రంగానికి అడ్వైజరీ
- అమరావతిలో 'న్యాయ' మణిహారం: రాజధాని ప్రస్థానంలో మరో మైలురాయి!
- ఇరాన్, గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్
- భారీ నిరసనలు..శ్రీనగర్లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత
- ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్గా అలిరెజా అరాఫీ నియామకం
- ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ
- ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..
- ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ కూడా హతం..!!
- దుబాయ్ లో బంగారం ధరలకు రెక్కలు..!!
- పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది: యూఏఈ









