ఒమన్లో ధూమపానానికి కొత్త నిబంధనలు
- October 27, 2022
మస్కట్: ప్రజారోగ్యం, మెరుగైన పర్యావరణాన్ని ప్రోత్సహించే ప్రయత్నాలలో భాగంగా మస్కట్ మునిసిపాలిటీ అనేక చర్యలను చేపట్టింది. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానంపై నిషేధిస్తూ తాజా ఆర్డర్ జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. బస్సులు, టాక్సీలు, విమానాలు, ఓడలు, పడవలు వంటి ప్రజా రవాణా వ్యవస్థలో ధూమపానాన్ని నిషేధించారు. స్మోకింగ్ జోన్లకు అనేక షరతులను విధించారు. ధూమపానం చేసేవారి కోసం నిర్దేశించిన స్థలం ఆమోదం కోసం, మున్సిపల్ ఆరోగ్య వ్యవహారాల విభాగం నుండి ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుంది. ఈ స్థలాలు తప్పనిసరిగా భద్రత, అగ్ని-నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని నిర్దేశించింది. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులను ధూమపానం ప్రదేశాలలోకి అనుమతించకూడదు. ప్రార్థనా గృహాలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, ఆరోగ్య-క్రీడా సౌకర్యాలలో కూడా ధూమపానాన్ని నిషేధించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఒమన్ శిక్షాస్మృతి ప్రకారం.. మొదటి - రెండవ ఉల్లంఘనకు OMR100 జరిమానా, గరిష్టంగా మూడు నెలల జైలు శిక్ష లేదా రెండు శిక్షలను ఏకకాలంలో విధించబడుతుంది. రెండవ ఉల్లంఘన తర్వాత ప్రతి తదుపరి ఉల్లంఘనకు OMR300 చొప్పున జరిమానా విధించబడుతుందని మునిసిపాలిటీ తెలిపింది. మునిసిపాలిటీ ద్వారా లైసెన్స్ పొందిన అవుట్లెట్లు నిబంధనలు ఉల్లంఘించినట్లయితే మొదటిసారి మూడు రోజులకు మించకుండా.. రెండవసారి ఏడు రోజులకు మించకుండా మూసివేత ఉత్తర్వులు జారీ చేస్తారు.
తాజా వార్తలు
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్







