ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌: విజయవాడ-షార్జా డైరెక్ట్‌ విమానం

- October 28, 2022 , by Maagulf
ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌: విజయవాడ-షార్జా డైరెక్ట్‌ విమానం

న్యూ ఢిల్లీ: విజయవాడ-షార్జా మధ్య డైరెక్ట్‌ విమాన సర్వీసు అందుబాటులోకి రానుంది.ఈ నెల 31న ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ఈ విమాన సర్వీసు ప్రారంభిస్తోంది.ఆ రోజు సాయంత్రం 6.35 గంటలకు విజయవాడ-షార్జా తొలి విమాన సర్వీసు ప్రారంభమవుతుంది. రూ.13,669 ప్రారంభ ధరతో ఈ సర్వీసు ప్రారంభిస్తున్నట్టు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ తెలిపింది.కాగా షార్జా-విజయవాడ సర్వీసు చార్జీ 399 ఎమిరేట్స్‌ దిర్హమ్స్‌ గా నిర్ణయించింది.యూఏఈ ముఖ్యంగా దుబాయ్‌, నార్త్రన్‌ ఎమిరేట్స్‌ వెళ్లే ప్రయాణికులకు విజయవాడ-షార్జా డైరెక్ట్‌ విమాన సర్వీసు అత్యంత ఉపయుక్తంగా ఉంటుందని ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సీఈఓ అలోక్‌ సింగ్‌ తెలిపారు. షార్జాతో పాటు మస్కట్‌, కువైట్‌లకు కూడా తమ సంస్థ విజయవాడ నుంచి నేరుగా విమాన సర్వీసులు నడుపుతున్నట్టు ప్రకటించారు.

విజయవాడ-షార్జా విమాన షెడ్యూల్ వివరాలు...

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com