టైరు పేలి అదుపుతప్పిన కారు.. ఇద్దరు భారతీయ ప్రవాసులు మృతి

- October 28, 2022 , by Maagulf
టైరు పేలి అదుపుతప్పిన కారు.. ఇద్దరు భారతీయ ప్రవాసులు మృతి

యూఏఈ: మలీహా రోడ్డులో గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ ప్రవాసులు మరణించారు. మృతులను ఫుజైరా నివాసి 43 ఏళ్ల ఎంఎన్పీ జలీల్, అతని వ్యాపార భాగస్వామి 45 ఏళ్ల జుబేర్ నంగరతుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతులు దుబాయ్‌కి తమ కారులో వస్తుండగా.. టైర్ పేలడంతో అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. మృతిచెందిన ఇద్దరు వ్యక్తులు కాస్మెటిక్, ఫ్యాన్సీ జ్యువెలరీ దుకాణాన్ని నడుపుతున్నారు. వీరికి ఒమన్‌తో పాటు యూఏఈలో వ్యాపారాలు ఉన్నాయి.

మృతులు చిన్ననాటి స్నేహితులు

కేరళకు చెందిన ఇద్దరు వ్యక్తులు దాదాపు 25 సంవత్సరాలుగా మధ్యప్రాచ్యంలో నివసిస్తున్నారు.గత 16 సంవత్సరాలుగా ఫుజైరాలో నివాసం ఉంటూ వ్యాపారాలు చేస్తున్నట్లు సామాజిక కార్యకర్త సబిత్ తెలిపారు. జలీల్, జుబేర్ చిన్ననాటి స్నేహితులని.. ఒకరినొకరు వదిలి ఉండలేరని, వారు కలిసే వ్యాపారం ప్రారంభించారని, ఇప్పుడు మరణంలో కూడా వారు ఒకటిగానే కలిసి ఉన్నారని భావోద్వేగంతో వివరించాడు. జలీల్ భార్య జాస్మినా, పిల్లలు ముహమ్మద్, ఫాతిమా, జుమానాలు ఫుజైరాలో నివాసం ఉంటున్నారు.  భారతీయ కమ్యూనిటీ సభ్యులు ఇప్పుడు వారి మృతదేహాలను ఇండియాకు తరలించడానికి అవసరమైన పత్రాలను ప్రాసెస్ చేసే పనిలో ఉన్నారని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com