భారత్ను ఓడిస్తే జింబాబ్వే కుర్రాడిని పెళ్లి చేసుకుంటానని పాక్ నటి ప్రకటన..
- November 03, 2022
పాకిస్తాన్: ప్రపంచవ్యాప్తంగా ఐసిసి టి20 వరల్డ్ కప్ గురించే చర్చ జరుగుతుంది. నిన్న జరిగిన మ్యాచ్ లో భారత్, బంగ్లాదేశ్ తో పోరాడింది. మ్యాచ్ మధ్యలో వర్షం పడి కొంత విరామం వచ్చినా, అది భారత్ జట్టుకు కలిసొచ్చింది అనే చెప్పాలి. ఉత్కంఠ పోరులో భారత్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇది ఇలా ఉంటే పాక్ అభిమానులు భారత్ వరల్డ్ కప్ పోరులో ఓడి వెనుదిరగాలి అంటూ వారి అక్కసుని చూపిస్తున్నారు.
నవంబర్ 6, ఆదివారం నాడు జరిగే మ్యాచ్ భారత్ కి చాలా కీలకం కానుంది. సూపర్ 12 మ్యాచ్లో చివరిగా భారత్ జట్టు జింబాబ్వేతో తలపడనుంది. ఈ మ్యాచ్ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతుంది. కాగా పాకిస్తాన్ నటి “సెహర్ షిన్వారీ” రాబోయే మ్యాచ్ గురించి ఒక ఆశక్తికర ట్వీట్ చేసింది. “ఆదివారం జరగబోయే మ్యాచ్ లో జింబాబ్వే ఇండియాని ఓడిస్తే నేను ఒక జింబాబ్వే వ్యక్తిని పెళ్లి చేసుకుంటా” అంటూ ట్వీట్ చేసింది.
ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.గతంలో కూడా ఈ నటి ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చింది. ‘భారత్ గెలిస్తే నేను నా ట్విట్టర్ అకౌంట్ ని డిలీట్ చేస్తాను’ అంటూ చెప్పుకురావడంతో, నెటిజెన్లు ఈ ట్వీట్స్ సంగతి ఏంటి అంటూ పాతవి రీ ట్వీట్స్ చేస్తున్నారు. మరి ఆదివారం జారబోయే మ్యాచ్ లో భారత్ గెలవనుందా లేక జింబాబ్వే గెలవనుందా చూడాలి.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







