సౌదీలో 3 మిలియన్ల క్యాప్టాగన్ ట్యాబ్లెట్లు స్వాధీనం
- November 05, 2022
రియాద్: ట్రక్కులో దాచి 3.25 మిలియన్ క్యాప్గాన్ ట్యాబ్లెట్లను జెడ్డా ఇస్లామిక్ పోర్ట్లోకి అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లు జకాత్, పన్ను, కస్టమ్స్ అథారిటీ పేర్కొన్నది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్తో కలిసి దిగుమతులపై కస్టమ్స్ నియంత్రణలను కఠినతరం చేయడం కొనసాగుతుందని తెలిపింది. రియాద్లోని ఓ గిడ్డంగిలో ఐరన్ మెషీన్ల షిప్మెంట్లో 1.9 మిలియన్లకు పైగా క్యాప్గాన్ ట్యాబ్లెట్లు దాచి స్మగ్లింగ్ చేస్తుండగా.. గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు అథారిటీ తెలిపింది. స్మగ్లింగ్ లేదా కస్టమ్స్ ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారం తెలిస్తే కాన్ఫిడెన్షియల్ హాట్లైన్ 1910, అంతర్జాతీయ నంబర్ 00 966 114208417 లేదా ఇమెయిల్ [email protected]కు సమాచారం అందజేయాలని సౌదీ అధికారులు కోరారు. సమాచారం అందజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని, విలువైన సమాచారం అందించిన వారికి ఆర్థిక రివార్డులు అందిస్తామని అథారిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..







