సౌదీలో 3 మిలియన్ల క్యాప్టాగన్ ట్యాబ్లెట్లు స్వాధీనం
- November 05, 2022
రియాద్: ట్రక్కులో దాచి 3.25 మిలియన్ క్యాప్గాన్ ట్యాబ్లెట్లను జెడ్డా ఇస్లామిక్ పోర్ట్లోకి అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లు జకాత్, పన్ను, కస్టమ్స్ అథారిటీ పేర్కొన్నది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్తో కలిసి దిగుమతులపై కస్టమ్స్ నియంత్రణలను కఠినతరం చేయడం కొనసాగుతుందని తెలిపింది. రియాద్లోని ఓ గిడ్డంగిలో ఐరన్ మెషీన్ల షిప్మెంట్లో 1.9 మిలియన్లకు పైగా క్యాప్గాన్ ట్యాబ్లెట్లు దాచి స్మగ్లింగ్ చేస్తుండగా.. గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు అథారిటీ తెలిపింది. స్మగ్లింగ్ లేదా కస్టమ్స్ ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారం తెలిస్తే కాన్ఫిడెన్షియల్ హాట్లైన్ 1910, అంతర్జాతీయ నంబర్ 00 966 114208417 లేదా ఇమెయిల్ [email protected]కు సమాచారం అందజేయాలని సౌదీ అధికారులు కోరారు. సమాచారం అందజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని, విలువైన సమాచారం అందించిన వారికి ఆర్థిక రివార్డులు అందిస్తామని అథారిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర సీఎం చంద్రబాబు
- హైదరాబాద్ పన్ను చెల్లింపుదారులకు శుభవార్త
- టీమిండియా ఐర్లాండ్ పర్యటన ఖరారు..షెడ్యూల్ ఇదే!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు..
- యుద్ధం ముగిసేందుకు అమెరికా మిత్రదేశాలు సహాయపడాలి: సయ్యద్ బదర్
- అమెరికాకు శ్రీలంక బిగ్ షాక్
- ఇరాన్ దాడుల పై జీసీసీ మానవ హక్కుల సంస్థల అత్యవసర సమావేశం..!!
- హోర్ముజ్ జలసంధి పై పలు దేశాల సంయుక్త ప్రకటన..!
- 118 మంది బిచ్చగాళ్లను అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- కువైట్ గోల్డ్ మార్కెట్లో తగ్గిన ఈద్ సందడి ..!!









