సౌదీలో 3 మిలియన్ల క్యాప్టాగన్ ట్యాబ్లెట్లు స్వాధీనం
- November 05, 2022
రియాద్: ట్రక్కులో దాచి 3.25 మిలియన్ క్యాప్గాన్ ట్యాబ్లెట్లను జెడ్డా ఇస్లామిక్ పోర్ట్లోకి అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లు జకాత్, పన్ను, కస్టమ్స్ అథారిటీ పేర్కొన్నది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్తో కలిసి దిగుమతులపై కస్టమ్స్ నియంత్రణలను కఠినతరం చేయడం కొనసాగుతుందని తెలిపింది. రియాద్లోని ఓ గిడ్డంగిలో ఐరన్ మెషీన్ల షిప్మెంట్లో 1.9 మిలియన్లకు పైగా క్యాప్గాన్ ట్యాబ్లెట్లు దాచి స్మగ్లింగ్ చేస్తుండగా.. గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు అథారిటీ తెలిపింది. స్మగ్లింగ్ లేదా కస్టమ్స్ ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారం తెలిస్తే కాన్ఫిడెన్షియల్ హాట్లైన్ 1910, అంతర్జాతీయ నంబర్ 00 966 114208417 లేదా ఇమెయిల్ [email protected]కు సమాచారం అందజేయాలని సౌదీ అధికారులు కోరారు. సమాచారం అందజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని, విలువైన సమాచారం అందించిన వారికి ఆర్థిక రివార్డులు అందిస్తామని అథారిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







