తెలుగు భాష పరిరక్షణకు కృషి...

- April 21, 2016 , by Maagulf
తెలుగు భాష పరిరక్షణకు  కృషి...

తెలుగు భాష పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రముఖ సినీ నటుడు, కవి తనికెళ్ళ భరణి అన్నారు. మం డలంలోని కారుమూరులో గురువారం ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చి న ఆయన తెలుగు పండితులతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా తనికెళ్ళ మాట్లాడుతూ రెండు రాషా్ట్రల్లో కమ్మని తెలుగు భాషను పరిరక్షించేందుకు పండితులు నడుం బిగించాలన్నారు. ప్రస్తుత తరుణంలో సాహిత్యం, తెలుగు భాషపై ప్రజల్లో మక్కు వ తగ్గుతుందన్నారు. తెలుగు భాషా సంస్కృ తి, సంప్రదాయాలకు దేశంలో ప్రత్యేక గుర్తిం పు ఉందన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేసి తెలుగు భాషను పెంపొందించే విధం గా కృషి చేయాలన్నారు. ఇరు రాషా్ట్రల్లో ప్రభుత్వాలు తెలుగు భాషపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రస్తుతం ఇంగ్లీషు అవసరమే అయినా మాతృభాష తెలుగుపై విద్యార్థులకు సంపూర్ణంగా అవగాహన కల్పించే విధంగా విద్యార్థులకు బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. మిత్రుడైన నల్లూరు ఆధిత్య భగవాన్‌ కుమార్తె లక్ష్మీ వైష్ణవి వివాహానికి హాజరైన ఆయన వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు నల్లూరు యోగానంద్‌, భట్టాచార్యులు, హరి అన్నయ్యశాస్ర్తి, మన్నె శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com