ఖతార్‌ మన్సౌరా గోడలపై ఇండియన్ ట్రక్ ఆర్ట్ చిత్రాలు

- November 06, 2022 , by Maagulf
ఖతార్‌ మన్సౌరా గోడలపై ఇండియన్ ట్రక్ ఆర్ట్ చిత్రాలు

దోహా: జెడారీఆర్ట్‌లో భాగంగా దోహా అల్ మన్సౌరా మెట్రో స్టేషన్ వెలుపల ప్రసిద్ధ ఇండియన్ ట్రక్ ఆర్ట్‌ చిత్రాలను చిత్రించారు. ఇవి ప్రయాణికులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. రంగు రంగుల పువ్వులు, కాలిగ్రఫీ కలిగి ఉన్న ఈ చిత్రాలు ఆసియా దేశాలలో ట్రక్కులు, బస్సులపై ఎక్కువగా కనిపిస్తాయి. మన్సౌరాలోన ట్రక్ ఆర్ట్ మ్యూరల్ ఆల్ ఇండియా పర్మిట్ చిత్రాన్ని ప్రముఖ చిత్రకారులు అఖ్లాక్ అహ్మద్ అకా షబ్బు,ఫరీద్ బావా చిత్రించారు. భారత బృందం ఏడు భాషలలో (హిందీ, ఇంగ్లీష్, బంగ్లా, పంజాబీ, అరబిక్, ఉర్దూ)  నినాదాలను రాసింది. ఖతార్ మ్యూజియం ఈ ఆసియా సంప్రదాయ కళారూపాలను దోహా వీధుల్లోకి తీసుకురావడానికి సహకారాన్ని అందిస్తుంది. ఖతార్ మ్యూజియమ్స్‌లోని పబ్లిక్ ఆర్ట్ డైరెక్టర్ అబ్దుల్‌రహ్మాన్ అహ్మద్ అల్ ఇషాక్ మాట్లాడుతూ... జెడారీ ఆర్ట్ అనేది ఒక పబ్లిక్ ఆర్ట్ ప్రోగ్రామ్ అని, దోహా నగరం అంతటా కొత్త పర్యాటక ఆకర్షణలను సృష్టించడం లక్ష్యంగా ఈ ప్రోగ్రామ్ చేపట్టినట్లు పేర్కొన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com