రేపు సుప్రీం కోర్టు విచారణ లైవ్ స్ట్రీమింగ్..
- November 06, 2022
న్యూ ఢిల్లీ: సుప్రీంకోర్టులో కేసు విచారణను సోమవారం లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బెంచ్ ఆధ్వర్యంలో జరిగే విచారణను లైవ్ స్ట్రీమింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి ప్రత్యేక కారణం ఉంది.
ప్రధాన న్యాయమూర్తిగా సోమవారం జస్టిస్ యూయూ లలిత్కు చివరి రోజు. దీంతో న్యాయమూర్తిగా తన చివరిరోజు విచారణను జస్టిస్ లలిత్ లైవ్ స్ట్రీమింగ్ చేయాలనుకున్నారు. ఇక ఈ బెంచ్లో జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ బెలా ఎమ్ త్రివేది కూడా ఉన్నారు. గత ఆగష్టులో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ చివరి పని రోజున కూడా ఇలాగే లైవ్ స్ట్రీమింగ్ చేశారు. తాజా లైవ్ స్ట్రీమింగ్ సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమవుతుంది. సుప్రీంకోర్టు వెబ్ క్యాస్ట్ చానెల్తోపాటు, యూట్యూబ్ ఛానెల్ ద్వారా లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. మరోవైపు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేయబోతున్న జస్టిస్ యూయూ లలిత్ మీడియాతో మాట్లాడారు.
తన పనితీరు విషయంలో సంతృప్తితో ఉన్నట్లు చెప్పారు. ‘‘ఈ రంగంలో 39 ఏళ్లుగా పని చేస్తున్నాను. నిజాయితీగా చెప్పాలంటే ప్రతి రోజూ నా వృత్తిని ఆస్వాదించాను. న్యాయవ్యవస్థలోని అన్ని దశల్ని చూశాను. అటు న్యాయవాదిగా.. ఇటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశాను. ఈ రంగంలోని అన్ని కోణాల్ని పరిశీలించాను. నేను సాధించినదాని విషయంలో పూర్తి సంతృప్తితో ఉన్నాను’’ అని జస్టిస్ యూయూ లలిత్ అన్నారు.
తాజా వార్తలు
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్







