కోవిడ్-19 అన్ని ఆంక్షలను ఎత్తేసిన యూఏఈ
- November 07, 2022
యూఏఈ: దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత అన్ని కోవిడ్ -19 ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు యూఏఈ ప్రభుత్వం ప్రకటించింది. ఆసుపత్రులలో ఆక్యుపెన్సీ రేట్లు, కోవిడ్ -19 సోకిన కేసుల ఇంటెన్సివ్ కేర్ను పర్యవేక్షిస్తూ దేశంలోని ఎపిడెమియోలాజికల్ పరిస్థితిని జాగ్రత్తగా అధ్యయనం చేసిన తర్వాత రెండవ దశ సడలింపులను ఆమోదించినట్లు ఆరోగ్య అధికారులు పేర్కొన్నారు. ప్రార్థనా స్థలాలు, మస్జీదులతో సహా అన్ని బహిరంగ, మూసి ఉన్న ప్రదేశాలలో మాస్కులు ధరించడం ఇక ఆప్షనల్. అయితే, ఆస్పత్రులు ఇతర ఆరోగ్యో కేంద్రాలలో అనారోగ్య బాధితులు మాత్రం కచ్చితంగా మాస్కులు ధరించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. కొత్త నిబంధనలు నవంబర్ 7 నుంచి అమల్లోకి రానున్నాయి. అల్ హోస్న్ అప్లికేషన్ ఇకపై టీకా ఫ్రూప్ కే పరిమితం చేయబడుతుందని తెలిపారు. కాగా, నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NCEMA) పాజిటివ్ కేసుల కోసం ఐదు రోజుల ఐసోలేషన్ వ్యవధి అలాగే ఉంటుందని, కోవిడ్-19 పీసీఆర్ పరీక్ష, ఆరోగ్య సౌకర్యాలు ఇప్పటికీ పనిచేయనున్నాయి.
తాజా వార్తలు
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- మూడు జోన్లుగా భాగ్యనగరం..సీఎం రేవంత్
- భూ మార్గాల ద్వారా కార్గో మళ్లింపు..కువైట్ కస్టమ్..!!
- ఖతార్ నేషనల్ లైబ్రరీ రీ ఓపెన్..టైమింగ్స్ ఇవే..!!
- రష్యన్ ఉప విదేశాంగ మంత్రితో బహ్రెయిన్ రాయబారి భేటీ..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు ఎంత మేర పెరగవచ్చు?
- ఒమన్ లో భారీ వర్షాలు..భద్రతా హెచ్చరికలు జారీ..!!









