కోవిడ్-19 అన్ని ఆంక్షలను ఎత్తేసిన యూఏఈ
- November 07, 2022
యూఏఈ: దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత అన్ని కోవిడ్ -19 ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు యూఏఈ ప్రభుత్వం ప్రకటించింది. ఆసుపత్రులలో ఆక్యుపెన్సీ రేట్లు, కోవిడ్ -19 సోకిన కేసుల ఇంటెన్సివ్ కేర్ను పర్యవేక్షిస్తూ దేశంలోని ఎపిడెమియోలాజికల్ పరిస్థితిని జాగ్రత్తగా అధ్యయనం చేసిన తర్వాత రెండవ దశ సడలింపులను ఆమోదించినట్లు ఆరోగ్య అధికారులు పేర్కొన్నారు. ప్రార్థనా స్థలాలు, మస్జీదులతో సహా అన్ని బహిరంగ, మూసి ఉన్న ప్రదేశాలలో మాస్కులు ధరించడం ఇక ఆప్షనల్. అయితే, ఆస్పత్రులు ఇతర ఆరోగ్యో కేంద్రాలలో అనారోగ్య బాధితులు మాత్రం కచ్చితంగా మాస్కులు ధరించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. కొత్త నిబంధనలు నవంబర్ 7 నుంచి అమల్లోకి రానున్నాయి. అల్ హోస్న్ అప్లికేషన్ ఇకపై టీకా ఫ్రూప్ కే పరిమితం చేయబడుతుందని తెలిపారు. కాగా, నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NCEMA) పాజిటివ్ కేసుల కోసం ఐదు రోజుల ఐసోలేషన్ వ్యవధి అలాగే ఉంటుందని, కోవిడ్-19 పీసీఆర్ పరీక్ష, ఆరోగ్య సౌకర్యాలు ఇప్పటికీ పనిచేయనున్నాయి.
తాజా వార్తలు
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్







