బహిరంగ పక్షులకు ఆహారం ఇవ్వడం మానుకోండి
- November 07, 2022
మస్కట్: బహిరంగ ప్రదేశాలలో పక్షులకు ఆహారం ఇవ్వడం మానుకోవాలని మస్కట్ మునిసిపాలిటీ సూచించింది. దీని కారణంగా ప్రజల ఆరోగ్యంతోపాటు పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని హెచ్చరించింది. మిగిలిపోయిన ధాన్యాలు, పక్షుల వ్యర్థాలతో కలిసిపోయి కుళ్ళిపోయి.. దుర్వాసన వెదజల్లుతుందని పేర్కొంది. దీని కారణంగా ప్రజలు తమ సమయాన్ని ఆరుబయట గడపకుండా లేదా బహిరంగ కూడళ్లలో క్రీడా కార్యకలాపాల్లో పాల్గొనకుండా అడ్డుకుంటుందని మున్సిపాలిటీ తెలిపింది. అంతేకాకుండా పక్షులను పోషించే ఉద్దేశంతో ధాన్యాలను నడక మార్గాలు, కాలిబాటలపై వేయడంతో అక్కడ కీటకాలు, పురుగులు, పరాన్నజీవుల సంఖ్య పెరిగి వాతావరణం కలుషితం అవుతందని, ఇది పురపాలక సిబ్బందిపై అదనపు భారాన్ని మోపుతుందని మస్కట్ మునిసిపాలిటీ పేర్కొన్నది.
తాజా వార్తలు
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్







