బహిరంగ పక్షులకు ఆహారం ఇవ్వడం మానుకోండి
- November 07, 2022
మస్కట్: బహిరంగ ప్రదేశాలలో పక్షులకు ఆహారం ఇవ్వడం మానుకోవాలని మస్కట్ మునిసిపాలిటీ సూచించింది. దీని కారణంగా ప్రజల ఆరోగ్యంతోపాటు పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని హెచ్చరించింది. మిగిలిపోయిన ధాన్యాలు, పక్షుల వ్యర్థాలతో కలిసిపోయి కుళ్ళిపోయి.. దుర్వాసన వెదజల్లుతుందని పేర్కొంది. దీని కారణంగా ప్రజలు తమ సమయాన్ని ఆరుబయట గడపకుండా లేదా బహిరంగ కూడళ్లలో క్రీడా కార్యకలాపాల్లో పాల్గొనకుండా అడ్డుకుంటుందని మున్సిపాలిటీ తెలిపింది. అంతేకాకుండా పక్షులను పోషించే ఉద్దేశంతో ధాన్యాలను నడక మార్గాలు, కాలిబాటలపై వేయడంతో అక్కడ కీటకాలు, పురుగులు, పరాన్నజీవుల సంఖ్య పెరిగి వాతావరణం కలుషితం అవుతందని, ఇది పురపాలక సిబ్బందిపై అదనపు భారాన్ని మోపుతుందని మస్కట్ మునిసిపాలిటీ పేర్కొన్నది.
తాజా వార్తలు
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







