చెన్నై- మైసూర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రయల్ రన్ ప్రారంభం
- November 07, 2022చెన్నై: చెన్నై, మైసూర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రయల్ రన్ చెన్నైలోని ఎం.జి.రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమైంది. ఈ రైలును నవంబర్ 11న ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. అయితే ఇది దక్షిణ భారతదేశంలో అందుబాటులోకి వచ్చే మొట్టమొదటి హై-స్పీడ్ రైలుగా ప్రసిద్ధికెక్కనుంది. అలాగే దేశంలో ఐదవ రైలుగా కీర్తించబడనుంది.
మొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఫిబ్రవరి 15, 2019న ఢిల్లీ కాన్పూర్ అలహాబాద్ వారణాసి మార్గంలో ప్రారంభమైంది. ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రచారాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ను తీసుకొచ్చారు. అయితే ఆగస్టు 15, 2021న ఎర్రకోట నుండి జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో 75 వారాలలో 75 వందేభారత్ రైళ్లు దేశంలోని ప్రతి మూలను కలుపుతాయని ప్రధాని మోడీ ప్రకటించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!