చెన్నై- మైసూర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రయల్ రన్ ప్రారంభం
- November 07, 2022
చెన్నై: చెన్నై, మైసూర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రయల్ రన్ చెన్నైలోని ఎం.జి.రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమైంది. ఈ రైలును నవంబర్ 11న ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. అయితే ఇది దక్షిణ భారతదేశంలో అందుబాటులోకి వచ్చే మొట్టమొదటి హై-స్పీడ్ రైలుగా ప్రసిద్ధికెక్కనుంది. అలాగే దేశంలో ఐదవ రైలుగా కీర్తించబడనుంది.
మొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఫిబ్రవరి 15, 2019న ఢిల్లీ కాన్పూర్ అలహాబాద్ వారణాసి మార్గంలో ప్రారంభమైంది. ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రచారాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ను తీసుకొచ్చారు. అయితే ఆగస్టు 15, 2021న ఎర్రకోట నుండి జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో 75 వారాలలో 75 వందేభారత్ రైళ్లు దేశంలోని ప్రతి మూలను కలుపుతాయని ప్రధాని మోడీ ప్రకటించారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







