చెన్నై- మైసూర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రయల్ రన్ ప్రారంభం
- November 07, 2022
చెన్నై: చెన్నై, మైసూర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రయల్ రన్ చెన్నైలోని ఎం.జి.రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమైంది. ఈ రైలును నవంబర్ 11న ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. అయితే ఇది దక్షిణ భారతదేశంలో అందుబాటులోకి వచ్చే మొట్టమొదటి హై-స్పీడ్ రైలుగా ప్రసిద్ధికెక్కనుంది. అలాగే దేశంలో ఐదవ రైలుగా కీర్తించబడనుంది.
మొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఫిబ్రవరి 15, 2019న ఢిల్లీ కాన్పూర్ అలహాబాద్ వారణాసి మార్గంలో ప్రారంభమైంది. ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రచారాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ను తీసుకొచ్చారు. అయితే ఆగస్టు 15, 2021న ఎర్రకోట నుండి జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో 75 వారాలలో 75 వందేభారత్ రైళ్లు దేశంలోని ప్రతి మూలను కలుపుతాయని ప్రధాని మోడీ ప్రకటించారు.
తాజా వార్తలు
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్







