జాన్వీ కపూర్ ఇలాంటి సినిమాలే ఎందుకు ఎంచుకుంటోంది.?
- November 08, 2022
అతిలోక సుందరి శ్రీదేవికి ముద్దుల తనయ, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. జాన్వీ సోషల్ మీడియా అకౌంట్ చూస్తేనేమో పక్కా కమర్షియల్. కానీ, స్ర్కీన్ మీద చూస్తే, జాన్వీ కపూర్ పూర్తిగా విభిన్నం.
హీరోయిన్ ఓరింయెంటెడ్, కథా బలం వున్న పాత్రల్లోనే నటిస్తోంది. జాన్వీ ఎందుకిలా చేస్తోంది.? అని నెటిజన్లు బుర్రలు బాదుకుంటున్నారు. అయితే, జాన్వీ కపూర్ మాత్రం తన పని తాను సైలెంట్గా చేసుకుంటూ పోతోంది.
తనను తాను నటిగా నిరూపించుకునే ప్రయత్నంలోని భాగమే ఇదంతా.. అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఇలా కథా నేపథ్యమున్న చిత్రాల్నే ఎంచుకుంటుంటే, కమర్షియల్ హీరోయిన్ అని ప్రూవ్ చేసుకునేదెప్పుడు.? వీటికే అలవాటు పడితే, ఆ తర్వాత కమర్షియల్ నటిగా చాన్సులు వస్తాయా.? కమర్షియల్ అనిపించుకుంటేనే కదా.. స్టార్ డమ్ వచ్చేది.? అని జాన్వీ డై హార్డ్ ఫ్యాన్స్ కలవరపడుతున్నారట.
ఇదే కలవరం జాన్వీలోనూ వుండాలి కదా. జాన్వీ మనసులో ఏముందో ఏమో. ఎవరికి ఎరుక.! ప్రస్తుతం జాన్వీ ‘మిలి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘మిలి’కి ముందుకు ‘గుడ్ లక్ జెర్రీ’ అనే సినిమాలో నటించింది.
తాజా వార్తలు
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్







