యూఏఈలో 5 సంవత్సరాల రెసిడెన్సీ వీసాల జారీ ప్రారంభం
- November 08, 2022
యూఏఈ: 5 సంవత్సరాల రెసిడెన్సీ వీసాల జారీని యూఏఈ ప్రారంభించింది.సెప్టెంబరు 5 నుండి అమలులోకి వచ్చిన విదేశీయుల ప్రవేశం, నివాసంపై కొత్త చట్టం అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా వీసాల జారీని యూఏఈ ప్రారంభించింది. ఎమిరాటీ తల్లుల పిల్లలకు ఐదేళ్ల రెసిడెన్సీ వీసాల కాలపరిమితి గతంలో 3 సంవత్సరాలుగా ఉండేది. 2022 జూన్ లో ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ దేశంలో నివసిస్తున్న ఎమిరాటీ తల్లుల పిల్లలకు విద్య, ఆరోగ్య రంగాలకు సంబంధించి ఇతర పౌరుల మాదిరిగానే ప్రయోజనాలను మంజూరు చేస్తూ ఒక తీర్మానాన్ని జారీ చేశారు.
యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఈ ఏడాది జూలైలో కేబినెట్ వీసాల జారీలో మార్పులకు ఆమోదం తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా పేరున్న వ్యక్తులు, కంపెనీల వ్యవస్థాపకులు, అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులను ఆకర్షించడానికి యూఏఈ వీసా సంస్కరణలను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగానే అత్యంత ప్రజాదరణ పొందిన గోల్డెన్ వీసా(ఐదేళ్ల పర్యాటక వీసా), ఐదేళ్ల గ్రీన్ వీసాలను ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!
- ఖతార్ అంతటా కస్టమర్ సాటిస్పెక్షన్ సర్వే 2026..!!
- జూన్ నెలలో 911 నెంబర్ కు 26 లక్షల కాల్స్..!!
- యూఏఈలో చిల్డ్రన్ మీడియా కంటెంట్ కోసం కొత్త ప్రమాణాలు..!!
- సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రోత్సాహకాలు
- జర్మనీలో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ అవకాశం..
- ముగిసిన తెలంగాణ ‘ఈ కేబినెట్’ భేటీ.. మూసీ ప్రాజెక్టు ఫేజ్-1కు ఆమోదం
- దుబాయ్లో ట్యాక్సీ డ్రైవర్లకు భారీ ఉద్యోగావకాశం







