తండ్రిపై 3.3 మిలియన్ దిర్హామ్ల దావా గెలిచిన కూతురు
- November 09, 2022
యూఏఈ: కుమార్తె సొమ్ముతో కొనుగోలు చేసిన ఆస్తిని ఆమెకు తెలియకుండా విక్రయించినందుకు ఒక తండ్రి తన కుమార్తెకు 3.3 మిలియన్ దిర్హామ్లు చెల్లించాలని అబుధాబి ఫ్యామిలీ అండ్ సివిల్ అడ్మినిస్ట్రేటివ్ క్లెయిమ్స్ కోర్టు ఆదేశించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. 16 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన ఆస్తిని అమ్మిన తండ్రిపై కూతురు కోర్టులో దావా వేసింది. తనకు Dh3.7 మిలియన్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. తన తండ్రి స్వాధీనంలో ఉన్న ఆస్తిని 2021లో తనకు తెలియకుండా 3.7 మిలియన్ దిర్హామ్లకు విక్రయించాడని, అమ్మిన నగదు మొత్తాన్ని అతను తన వద్దనే ఉంచుకున్నాడని ఆమె తన పిటిషన్ లో పేర్కొంది. అన్ని పక్షాల వాదనలు విన్న అబుధాబి ఫ్యామిలీ అండ్ సివిల్ అడ్మినిస్ట్రేటివ్ క్లెయిమ్స్ కోర్టు తన కుమార్తెకు 3.3 మిలియన్ దిర్హామ్లు చెల్లించాలని తండ్రిని ఆదేశించింది. నష్టపరిహారం కింద Dh50,000 చెల్లించాలని, కుమార్తె న్యాయపరమైన ఖర్చులను కూడా చెల్లించాలని అతనిని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







