తండ్రిపై 3.3 మిలియన్ దిర్హామ్ల దావా గెలిచిన కూతురు
- November 09, 2022
యూఏఈ: కుమార్తె సొమ్ముతో కొనుగోలు చేసిన ఆస్తిని ఆమెకు తెలియకుండా విక్రయించినందుకు ఒక తండ్రి తన కుమార్తెకు 3.3 మిలియన్ దిర్హామ్లు చెల్లించాలని అబుధాబి ఫ్యామిలీ అండ్ సివిల్ అడ్మినిస్ట్రేటివ్ క్లెయిమ్స్ కోర్టు ఆదేశించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. 16 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన ఆస్తిని అమ్మిన తండ్రిపై కూతురు కోర్టులో దావా వేసింది. తనకు Dh3.7 మిలియన్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. తన తండ్రి స్వాధీనంలో ఉన్న ఆస్తిని 2021లో తనకు తెలియకుండా 3.7 మిలియన్ దిర్హామ్లకు విక్రయించాడని, అమ్మిన నగదు మొత్తాన్ని అతను తన వద్దనే ఉంచుకున్నాడని ఆమె తన పిటిషన్ లో పేర్కొంది. అన్ని పక్షాల వాదనలు విన్న అబుధాబి ఫ్యామిలీ అండ్ సివిల్ అడ్మినిస్ట్రేటివ్ క్లెయిమ్స్ కోర్టు తన కుమార్తెకు 3.3 మిలియన్ దిర్హామ్లు చెల్లించాలని తండ్రిని ఆదేశించింది. నష్టపరిహారం కింద Dh50,000 చెల్లించాలని, కుమార్తె న్యాయపరమైన ఖర్చులను కూడా చెల్లించాలని అతనిని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం









