తండ్రిపై 3.3 మిలియన్ దిర్హామ్‌ల దావా గెలిచిన కూతురు

- November 09, 2022 , by Maagulf
తండ్రిపై 3.3 మిలియన్ దిర్హామ్‌ల దావా గెలిచిన కూతురు

యూఏఈ: కుమార్తె సొమ్ముతో కొనుగోలు చేసిన ఆస్తిని ఆమెకు తెలియకుండా విక్రయించినందుకు ఒక తండ్రి తన కుమార్తెకు 3.3 మిలియన్ దిర్హామ్‌లు చెల్లించాలని అబుధాబి ఫ్యామిలీ అండ్ సివిల్ అడ్మినిస్ట్రేటివ్ క్లెయిమ్స్ కోర్టు ఆదేశించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. 16 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన ఆస్తిని అమ్మిన తండ్రిపై కూతురు కోర్టులో దావా వేసింది. తనకు Dh3.7 మిలియన్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. తన తండ్రి స్వాధీనంలో ఉన్న ఆస్తిని  2021లో తనకు తెలియకుండా 3.7 మిలియన్ దిర్హామ్‌లకు విక్రయించాడని, అమ్మిన నగదు మొత్తాన్ని అతను తన వద్దనే ఉంచుకున్నాడని ఆమె తన పిటిషన్ లో పేర్కొంది. అన్ని పక్షాల వాదనలు విన్న అబుధాబి ఫ్యామిలీ అండ్ సివిల్ అడ్మినిస్ట్రేటివ్ క్లెయిమ్స్ కోర్టు తన కుమార్తెకు 3.3 మిలియన్ దిర్హామ్‌లు చెల్లించాలని తండ్రిని ఆదేశించింది. నష్టపరిహారం కింద Dh50,000 చెల్లించాలని, కుమార్తె న్యాయపరమైన ఖర్చులను కూడా చెల్లించాలని అతనిని కోర్టు ఆదేశించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com