హోటల్ ఫర్నీచర్ కు నిప్పుపెట్టిన వ్యక్తికి జైలు శిక్ష

- November 09, 2022 , by Maagulf
హోటల్ ఫర్నీచర్ కు నిప్పుపెట్టిన వ్యక్తికి జైలు శిక్ష

బహ్రెయిన్: హోటల్ ఫర్నీచర్ నిప్పుపెట్టిన వ్యక్తికి కోర్టు జైలు శిక్ష విధించింది. బహ్రెయిన్ పోలీసుల కథనం ప్రకారం.. ఓ వ్యక్తి మద్యం మత్తులో హోటల్ ఫర్నీచర్ లో కొంత భాగాన్ని నిప్పంటించి, ఆ చర్యను చిత్రీకరించాడు. దాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. హోటల్ నిర్వాహకుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకొని మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాయి.  కేసును విచారించిన కోర్టు హోటల్ ఫర్నిచర్ కు నిప్పుపెట్టిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష విధించబడింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com