ఏపీలో మంచి రోజులు వస్తాయి: పవన్ కళ్యాణ్
- November 11, 2022
విశాఖపట్నం: ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశం జనసేనాని అధినేత పవన్ కల్యాణ్, ప్రధాని మోదీ సమావేశం. విశాఖపట్నం పర్యటన కోసం వచ్చిన ప్రధాని మోదీని పవన్ కల్యాణ్ కలిశారు. ప్రధానితో శుక్రవారం రాత్రి పవన్ భేటీ అయ్యారు.35 నిమిషాల పాటు వీరి భేటీ సాగింది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, రెండు పార్టీలు కలిసి పని చేయడంపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రధానితో భేటీలో పవన్ తో పాటు నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.
ప్రధానితో భేటీ అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు. 8 ఏళ్ల తర్వాత ప్రధాని మోదీని కలిశానని పవన్ తెలిపారు. ఏపీలోని పరిస్థితులన్నీ ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారని పవన్ చెప్పారు.
తనకున్న అవగాహన మేరకు అన్ని విషయాలు చెప్పానన్నారు. ఏపీ ప్రజలు బాగుండాలి, ఏపీ ప్రజలు అభివృద్ధి చెందాలి, తెలుగు ప్రజల ఐక్యత వర్దిల్లాలి అని ప్రధాని మోదీ ఆకాంక్షించారని పవన్ కల్యాణ్ అన్నారు. ఒక ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన సమావేశం ఇది అని పవన్ వ్యాఖ్యానించారు. ప్రధానితో భేటీతో ఏపీకి మంచి జరగబోతోందని, భవిష్యత్తులో రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏపీకి మంచి జరగబోతోంది, రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి అంటూ.. ప్రధానితో భేటీ తర్వాత జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచాయి. పవన్ కామెంట్స్ రాజకీయవర్గాల్లో చర్చకు దారితీశాయి. పవన్ ఏ ఉద్దేశ్యంతో ఆ కామెంట్స్ చేశారు? ఏపీకి జరగనున్న ఆ మంచి ఏంటి? అనేదాని ఆసక్తికరంగా మారింది.
తాజా వార్తలు
- ఫోన్పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం