బహ్రెయిన్ పార్లమెంట్ ఎన్నికలకు ముందు కీలక వెబ్సైట్ల పై హ్యాకర్లు దాడి
- November 12, 2022
బహ్రెయిన్: పార్లమెంటు ఎన్నికలకు కొన్ని గంటల ముందు శనివారం హ్యాకర్లు దేశంలోని వెబ్సైట్లను లక్ష్యంగా చేసుకున్నారని బహ్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొన్ని వెబ్సైట్ల ద్వారా ఎన్నికలకు ఆటంకం కలిగించాలని హ్యాకర్లు లక్ష్యంగా పెట్టుకున్నారని, వాటిల్లో ప్రతికూల సందేశాలను ప్రసారం చేస్తారని అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే, ఇలాంటి చర్యలు పోలింగ్ స్టేషన్లకు వెళ్లే పౌరుల నిర్ణయాన్ని ప్రభావితం చేయలేవని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వెబ్ సైట్లు హ్యాకింగ్ కు గురైన తర్వాత వచ్చిన మెసేజులను స్క్రీన్షాట్ తీసి ఇంటర్నెట్ వినియోగదారులు తమ సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేస్తున్నారని, ఇలాంటివి చేయొద్దని మంత్రిత్వ శాఖ సూచించింది. బహ్రెయిన్లో పార్లమెంటరీ, మునిసిపల్ ఎన్నికలకు కొన్ని గంటల ముందు ఈ దాడి జరిగిందని తెలుస్తోంది. బహ్రెయిన్ పార్లమెంట్ దిగువ సభ అయిన ప్రతినిధుల మండలిలోని 40 మంది సభ్యులను ఓటర్లు ఎన్నుకుంటారు. పార్లమెంటు ఎగువ సభ, కన్సల్టేటివ్ కౌన్సిల్, హిజ్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాచే రాయల్ డిక్రీ ద్వారా నియమించబడింది.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







