రామగుండంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధాని మోడీ
- November 12, 2022
ఖమ్మం: ప్రధాని మోడీ రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ కర్మాగారాన్ని లాంఛనంగా ప్రారంభించారు.ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ప్లాంట్ను ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు.తెలంగాణతో పాటు..దక్షిణాది రాష్ట్రాల్లో రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ కర్మాగారం ద్వారా ఎరువుల కొరత తీరనుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సహా ఆరు సంస్థల భాగస్వామ్యంతో FCI , RFCL గా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించారు.ఈ కార్మాగారాన్ని గ్యాస్ ఆధారితంగా రూపొందించారు. ఈ కర్మాగారం పునరుద్ధరణకు రూ. 6,338 కోట్లను కేటాయిచారు. ఏడాదికి 12.7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి లక్ష్యంగా రామగుండం ఎరువుల కర్మాగారం పనిచేయనుంది. ఇందులో ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ఫెర్టిలైజర్స్ని తెలంగాణకి కేటాయిస్తారు. మొత్తంగా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేసే ఎరువుల్లో 46 % ఎరువులను తెలంగాణకి ఉపయోగించనున్నారు. మిగిలిన 54 శాతాన్ని ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







