రిషికొండ ను పరిశీలించిన పవన్ కళ్యాణ్
- November 12, 2022
విశాఖపట్నం: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వైజాగ్ లో పర్యటిస్తున్నారు. శుక్రవారం ప్రధాని మోడీ ని కలిసిన పవన్ కళ్యాణ్..ఈరోజు రిషికొండ ను పరిశీలించారు. గత కొద్దీ నెలలుగా రుషికొండ ఫై వైస్సార్సీపీ నేతలు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని , రుషికొండ ను మొత్తం తవ్వేస్తుందని ఆరోపణల నేపథ్యంలో స్వయంగా దానిని పరిశీలించేందుకు పవన్ కళ్యాణ్ వెళ్లారు.
కొంతమంది పార్టీ నేతలతో కలిసి పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకున్నారు. కొండపై జరుగుతున్న పనులేమిటన్న దానిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కొండపై పనులు జరుగుతున్న ప్రాంతాల్లో భారీ షీట్లతో బారీకేడ్లు ఏర్పాటు చేసి ఉండగా…వాటిని ముట్టుకోని పవన్.. ఆ బారీకేడ్లకు ఆనుకుని ఉన్న ఓ మట్టి గుట్టను ఎక్కి… బారీకేడ్ల అవతలి వైపు ఏం జరుగుతోందన్న దానిని పరిశీలించారు.
అలాగే పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తో కలిసి కాసేపు బీచ్ లో నడిచారు. బీచ్ నీళ్లలో కలియతిరిగారు. అక్కడే కనిపించిన మత్సకారులతో మాట్లాడారు. ఫిషింగ్ గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ సడన్ గా బీచ్ కు రావడంతో ఆయన్ని చూసేందుకు స్ధానికులు తరలివచ్చారు.ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. పవన్ కళ్యాణ్ బీచ్ కు వెళ్లారని తెలియడంతో మీడియా ప్రతినిధులు కూడా భారీగా అక్కడికి చేరుకున్నారు. తొలుత బీచ్ నీళ్లలో నడుస్తూ ఎంజాయ్ చేసిన పవన్… అనంతరం జనం తాకిడి పెరుగుతుంటంతో అక్కడి నుంచి బయలుదేరారు.అయినా దారిపొడవునా జనం ఆయనతో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు.
రిషికొండను మింగేస్తున్న వైసీపీ ప్రభుత్వ తీరును కనులారా వీక్షించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు. విశాఖపట్నం పర్యటన లో భాగంగా రుషికొండ ను పరిశీలించడానికి వెళ్లగా, కొండ చుట్టూ బారికేడ్లు పెట్టి లోపల పనులు చేస్తుండటంతో బయట నుంచి కొండపై జరుగుతున్న పనులను శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరిశీలించారు. pic.twitter.com/flTAs3WfHt
— JanaSena Party (@JanaSenaParty) November 12, 2022
తాజా వార్తలు
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్







