అబుధాబిలో హ్యారీపోటర్ థీమ్ ల్యాండ్
- November 13, 2022
యూఏఈ: అబుధాబిలోని యాస్ ద్వీపంలో ఏర్పాటైన హ్యారీపోటర్ థీమ్ ల్యాండ్ హ్యారీపోటర్ అభిమానులతోపాటు సందర్శకులను ఆహ్వానిస్తోంది. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీతో భాగస్వామ్యంతో మిరల్ హ్యారీ పాటర్ నేపథ్య థీమ్ ను రూపొందించింది. మిడిల్ ఈస్ట్లో ఈ తరహా థీమ్ ల్యాండ్ మొదటిది కావడం గమనార్హం. మిరల్ చైర్మన్ మొహమ్మద్ ఖలీఫా అల్ ముబారక్ ఈ ప్రాజెక్ట్ గురించి చెబుతూ.. అబుధాబి పర్యాటక రంగానికి, ఎమిరేట్ వృద్ధికి, ఆర్థిక వైవిధ్యానికి దోహదపడుతుందన్నారు. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ గ్లోబల్ బ్రాండ్స్ ప్రెసిడెంట్ పామ్ లిఫోర్డ్ మాట్లాడుతూ.. విజార్డింగ్ వరల్డ్ ప్రతి వయస్సు అభిమానులకు ఆనందాన్ని అందిస్తుందన్నారు. ఒరిజినల్ హ్యారీ పోటర్ కథలు, బ్లాక్బస్టర్ ఫిల్మ్ సిరీస్లు ప్రపంచవ్యాప్తంగా వందల మిలియన్ల మంది అభిమానులను ఆకర్షించాయన్నారు.
తాజా వార్తలు
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు







