అబుధాబిలో హ్యారీపోటర్ థీమ్ ల్యాండ్
- November 13, 2022
            యూఏఈ: అబుధాబిలోని యాస్ ద్వీపంలో ఏర్పాటైన హ్యారీపోటర్ థీమ్ ల్యాండ్ హ్యారీపోటర్ అభిమానులతోపాటు సందర్శకులను ఆహ్వానిస్తోంది. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీతో భాగస్వామ్యంతో మిరల్ హ్యారీ పాటర్ నేపథ్య థీమ్ ను రూపొందించింది. మిడిల్ ఈస్ట్లో ఈ తరహా థీమ్ ల్యాండ్ మొదటిది కావడం గమనార్హం. మిరల్ చైర్మన్ మొహమ్మద్ ఖలీఫా అల్ ముబారక్ ఈ ప్రాజెక్ట్ గురించి చెబుతూ.. అబుధాబి పర్యాటక రంగానికి, ఎమిరేట్ వృద్ధికి, ఆర్థిక వైవిధ్యానికి దోహదపడుతుందన్నారు. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ గ్లోబల్ బ్రాండ్స్ ప్రెసిడెంట్ పామ్ లిఫోర్డ్ మాట్లాడుతూ.. విజార్డింగ్ వరల్డ్ ప్రతి వయస్సు అభిమానులకు ఆనందాన్ని అందిస్తుందన్నారు. ఒరిజినల్ హ్యారీ పోటర్ కథలు, బ్లాక్బస్టర్ ఫిల్మ్ సిరీస్లు ప్రపంచవ్యాప్తంగా వందల మిలియన్ల మంది అభిమానులను ఆకర్షించాయన్నారు.
తాజా వార్తలు
- లండన్లో సీఎం చంద్రబాబు–యూకే హైకమిషనర్తో భేటీ
 - హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ రీస్టార్ట్..
 - కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
 - భారత్ DMF డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025
 - బహ్రెయిన్-భారత్ చర్చలు..వాణిజ్యం, భద్రత మరియు ప్రాంతీయ శాంతిపై దృష్టి..!!
 - బిగ్ టికెట్ డ్రాలో Dh25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్ను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు..!!
 - యూనిఫైడ్ GCC వీసాపై క్లారిటీ ఇచ్చిన సౌదీ పర్యాటక మంత్రి..!!
 - కువైట్ రైల్వే ప్రాజెక్ట్.. రైల్వే స్టేషన్ మొదటి దశ పూర్తి..!!
 - సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఖతార్..!!
 - ఒమన్ చోరీ కేసులలో పలువురి అరెస్టు..!!
 







