తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు మృతి
- November 13, 2022
తెలంగాణ: సూర్యాపేట జిల్లా మునగాల సమీపంలో శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా , మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. శనివారం రాత్రి మునగాల మండల కేంద్రానికి చెందిన పలువురు సాగర్ ఎడమకాలువ గట్టుపై ఉన్న అయ్యప్ప ఆలయంలో మహాపడిపూజ కార్యక్రమానికి హాజరయ్యారు. పూజ అనంతరం అర్ధరాత్రి 12 గంటల సయంలో ట్రాక్టర్లో తిరుగుపయాణమయ్యారు. అయితే యూటర్న్ అయప్ప ఆలయం నుంచి కిలోమీటరున్నర దూరం ఉండటంతో దూరాన్ని తగ్గించుకోవడానికి.. డ్రైవర్ ట్రాక్టర్ను హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రాంగ్రూట్లో తీసుకెళ్లాడు.
ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి విజయజవాడ వైపు వెళ్తున్న లారీ ట్రాక్టర్ను ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మరణించగా, మరొకరు హాస్పటల్ లో మృతిచెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రగాయాలైనవారిని ఖమ్మం, సూర్యాపేటలోని హాస్పిటళ్లకు తరలించగా, స్వల్పంగా గాయపడినవారికి కోదాడ ప్రభుత్వ దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. మృతులను తన్నీరు ప్రమీల, చింతకాయల ప్రమీల, ఉదయ్ లోకేష్, నారగాని కోటయ్య, గండు జ్యోతిగా గుర్తించారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో సుమారు 38 మంది ఉన్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









