భారత్ లో 10 బిలియన్ డాలర్లు దాటిన యూఏఈ పెట్టుబడులు
- November 13, 2022
అబుధాబి: భారతదేశంలో పునరుత్పాదక శక్తి, టెలికాం, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇతర రంగాలలో $10 బిలియన్లకు పైగా పెట్టుబడులను యూఏఈ సావరిన్ వెల్త్ ఫండ్స్ పెట్టాయని అబుధాబిలో జరిగిన ఒక కార్యక్రమంలో యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ తెలిపారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) మూడు రోజుల వార్షిక సదస్సు NATCON 2022లో సంజయ్ సుధీర్ పాల్గొని మాట్లాడారు. 2014 నుండి ద్వైపాక్షిక సంబంధాలలో వేగవంతమైన పురోగతిని సాధించామన్నారు. ఫిబ్రవరి 2022లో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA)పై సంతకం చేయడంతో ద్వైపాక్షిక వాణిజ్యం బలోపేతం అయిందన్నారు. షేక్ మహ్మద్ బిన్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ ప్రారంభించిన ఈ సదస్సులో భారతదేశం నుండి 1,300 మందికి పైగా డెవలపర్లు పాల్గొంటున్నారు. క్రెడాయ్ అనేది భారతదేశంలోని 13,000 కంటే ఎక్కువ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ డెవలపర్లకు భాగస్వామ్యం వహిస్తుంది. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ అధ్యక్షులు హర్ష్ వర్ధన్ పటోడియా, బొమన్ ఇరానీ, ఛైర్మన్ సతీష్ మాగర్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







