ఐబీఎస్ కాలేజీ ర్యాగింగ్ కేసు.. ఐదుగురు విద్యార్థులు అరెస్ట్

- November 13, 2022 , by Maagulf
ఐబీఎస్ కాలేజీ ర్యాగింగ్ కేసు.. ఐదుగురు విద్యార్థులు అరెస్ట్

హైదరాబాద్: హైదరాబాద్ లో కలకలం రేపుతున్న IBS కాలేజీ ర్యాగింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జూనియర్ విద్యార్థిపై పది మంది సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పడ్డారని గుర్తించిన పోలీసులు.. ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేశారు. మరో ఐదుగురు విద్యార్థుల కోసం గాలిస్తున్నారు. అటు ర్యాగింగ్ ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యంపైనా పోలీసులు దృష్టి పెట్టారు. ఈ కేసులో మేనేజ్ మెంట్ నిర్లక్ష్యం ఉంటే చర్యలు తప్పవంటున్నారు పోలీసులు.

ర్యాగింగ్ ఘటనపై వివిధ కోణాల్లో దర్యాఫ్తు చేస్తుండగా.. నాలుగు పోలీసు బృందాలు విచారణలో పాల్గొంటున్నాయి. ఈ నెల 1వ తేదీన ఐబీఎస్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన చోటు చేసుకుంది. బాధితుడి ఫిర్యాదు చేయగా పోలీసులు రాజీ కుదిర్చి పంపారు. దీనికి సంబంధించి బాధిత విద్యార్థి మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేయడంతో 12మంది సీనియర్ విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు వర్సిటీ యాజమాన్యం ఆ 12మంది విద్యార్థులను సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై ఐబీఎస్ లో యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ దర్యాఫ్తు అనంతరం మరికొంత మంది విద్యార్థులపై వేటు పడే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com