ఐబీఎస్ కాలేజీ ర్యాగింగ్ కేసు.. ఐదుగురు విద్యార్థులు అరెస్ట్
- November 13, 2022
హైదరాబాద్: హైదరాబాద్ లో కలకలం రేపుతున్న IBS కాలేజీ ర్యాగింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జూనియర్ విద్యార్థిపై పది మంది సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పడ్డారని గుర్తించిన పోలీసులు.. ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేశారు. మరో ఐదుగురు విద్యార్థుల కోసం గాలిస్తున్నారు. అటు ర్యాగింగ్ ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యంపైనా పోలీసులు దృష్టి పెట్టారు. ఈ కేసులో మేనేజ్ మెంట్ నిర్లక్ష్యం ఉంటే చర్యలు తప్పవంటున్నారు పోలీసులు.
ర్యాగింగ్ ఘటనపై వివిధ కోణాల్లో దర్యాఫ్తు చేస్తుండగా.. నాలుగు పోలీసు బృందాలు విచారణలో పాల్గొంటున్నాయి. ఈ నెల 1వ తేదీన ఐబీఎస్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన చోటు చేసుకుంది. బాధితుడి ఫిర్యాదు చేయగా పోలీసులు రాజీ కుదిర్చి పంపారు. దీనికి సంబంధించి బాధిత విద్యార్థి మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేయడంతో 12మంది సీనియర్ విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు వర్సిటీ యాజమాన్యం ఆ 12మంది విద్యార్థులను సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై ఐబీఎస్ లో యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ దర్యాఫ్తు అనంతరం మరికొంత మంది విద్యార్థులపై వేటు పడే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









