ఐబీఎస్ కాలేజీ ర్యాగింగ్ కేసు.. ఐదుగురు విద్యార్థులు అరెస్ట్
- November 13, 2022
హైదరాబాద్: హైదరాబాద్ లో కలకలం రేపుతున్న IBS కాలేజీ ర్యాగింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జూనియర్ విద్యార్థిపై పది మంది సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పడ్డారని గుర్తించిన పోలీసులు.. ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేశారు. మరో ఐదుగురు విద్యార్థుల కోసం గాలిస్తున్నారు. అటు ర్యాగింగ్ ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యంపైనా పోలీసులు దృష్టి పెట్టారు. ఈ కేసులో మేనేజ్ మెంట్ నిర్లక్ష్యం ఉంటే చర్యలు తప్పవంటున్నారు పోలీసులు.
ర్యాగింగ్ ఘటనపై వివిధ కోణాల్లో దర్యాఫ్తు చేస్తుండగా.. నాలుగు పోలీసు బృందాలు విచారణలో పాల్గొంటున్నాయి. ఈ నెల 1వ తేదీన ఐబీఎస్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన చోటు చేసుకుంది. బాధితుడి ఫిర్యాదు చేయగా పోలీసులు రాజీ కుదిర్చి పంపారు. దీనికి సంబంధించి బాధిత విద్యార్థి మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేయడంతో 12మంది సీనియర్ విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు వర్సిటీ యాజమాన్యం ఆ 12మంది విద్యార్థులను సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై ఐబీఎస్ లో యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ దర్యాఫ్తు అనంతరం మరికొంత మంది విద్యార్థులపై వేటు పడే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్







