సిరియా మిలిటరీ ఎయిర్ బేస్పై మిసైల్స్తో ఇజ్రాయెల్ దాడి
- November 14, 2022
ఇజ్రాయెల్: సిరియా పై ఇజ్రాయెల్ మిస్సైల్ తో విరుచుకుపడింది. ఆదివారం (నవంబర్,2022) సిరియాలోని హామ్స్ ప్రావిన్సులో ఉన్న షరియత్ మిలిటరీ ఎయిర్ బేస్ పై క్షిపణులతో దాడి చేసిందని..ఇజ్రాయెల్ దాడులతో తమ ఎయిర్ బేస్ స్వల్పంగా ధ్వంసమయిందని సిరియా మిలటరీ వెల్లడించింది. ఈ దాడుల్లో ఇద్దరు సైనికులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
హామ్స్ నగరానికి ఆగ్నేయంగా ఉన్న విశాలమైన ఎయిర్ బేస్ రన్ వేని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడికి పాల్పడింది. ఈ విమానాశ్రయాన్ని కొంత కాలంగా ఇరాన్ వైమానిక దళం ఉపయోగించుకుంటోంది. ఈ కారణంగానే ఇజ్రాయెల్ దాడి చేసినట్లుగా సమాచారం. ఇజ్రాయెల్ రెండు నెలల క్రితం సిరియా రాజధాని డమాస్కస్ పై దాడి చేసింది. ఇంటెలిజెన్స్ కార్యాలయాలు, అత్యున్నత ర్యాంకులు కలిగిన అధికారుల కార్యాలయాలే లక్ష్యంగా క్షిపణులను ప్రయోగించింది. ఆ దాడుల్లో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోగా… మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









