సిరియా మిలిటరీ ఎయిర్ బేస్పై మిసైల్స్తో ఇజ్రాయెల్ దాడి
- November 14, 2022
ఇజ్రాయెల్: సిరియా పై ఇజ్రాయెల్ మిస్సైల్ తో విరుచుకుపడింది. ఆదివారం (నవంబర్,2022) సిరియాలోని హామ్స్ ప్రావిన్సులో ఉన్న షరియత్ మిలిటరీ ఎయిర్ బేస్ పై క్షిపణులతో దాడి చేసిందని..ఇజ్రాయెల్ దాడులతో తమ ఎయిర్ బేస్ స్వల్పంగా ధ్వంసమయిందని సిరియా మిలటరీ వెల్లడించింది. ఈ దాడుల్లో ఇద్దరు సైనికులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
హామ్స్ నగరానికి ఆగ్నేయంగా ఉన్న విశాలమైన ఎయిర్ బేస్ రన్ వేని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడికి పాల్పడింది. ఈ విమానాశ్రయాన్ని కొంత కాలంగా ఇరాన్ వైమానిక దళం ఉపయోగించుకుంటోంది. ఈ కారణంగానే ఇజ్రాయెల్ దాడి చేసినట్లుగా సమాచారం. ఇజ్రాయెల్ రెండు నెలల క్రితం సిరియా రాజధాని డమాస్కస్ పై దాడి చేసింది. ఇంటెలిజెన్స్ కార్యాలయాలు, అత్యున్నత ర్యాంకులు కలిగిన అధికారుల కార్యాలయాలే లక్ష్యంగా క్షిపణులను ప్రయోగించింది. ఆ దాడుల్లో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోగా… మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.
తాజా వార్తలు
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!







