ఖతార్లో ఫిఫా ప్రపంచకప్ టిక్కెట్ల రీసేల్.. ముగ్గురు అరెస్ట్
- November 14, 2022
దోహా: ఫిఫా వరల్డ్ కప్ ఖతార్ 2022 కోసం అనధికారిక ప్లాట్ఫారమ్ల ద్వారా టిక్కెట్లను రీసేల్ చేసినందుకు ఖతార్ భద్రతా అధికారులు వేర్వేరు దేశాలకు చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ప్రపంచ కప్ టిక్కెట్లను ఫిఫా, ఆతిథ్య దేశం ఆమోదించిన నిర్దిష్ట అవుట్లెట్ల ద్వారా మాత్రమే తిరిగి విక్రయించాలి. ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్ టిక్కెట్లను జారీ చేయడానికి, పంపిణీ చేయడానికి, విక్రయించడానికి ఖతార్ కు మాత్రమే ప్రత్యేక హక్కు ఉన్నది. ఈ టిక్కెట్లను రీసేల్ చేయడం చట్టరిత్యా నేరం. టిక్కెట్ల పునఃవిక్రయం ప్రక్రియను నియంత్రించే ఫిఫా చట్టాలు, విధానాలకు కట్టుబడి ఉండాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజలకు పిలుపునిచ్చింది. సంబంధిత చట్టంలోని ఆర్టికల్ (19)/రెండవ పేరాలోని నిబంధనలను ఉల్లంఘించిన వారిపై రెండు లక్షల యాభై వేల రియాల్ల కంటే ఎక్కువ జరిమానా విధించే అవకాశం ఉందని భద్రతా అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్







