ఖతార్లో ఫిఫా ప్రపంచకప్ టిక్కెట్ల రీసేల్.. ముగ్గురు అరెస్ట్
- November 14, 2022
దోహా: ఫిఫా వరల్డ్ కప్ ఖతార్ 2022 కోసం అనధికారిక ప్లాట్ఫారమ్ల ద్వారా టిక్కెట్లను రీసేల్ చేసినందుకు ఖతార్ భద్రతా అధికారులు వేర్వేరు దేశాలకు చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ప్రపంచ కప్ టిక్కెట్లను ఫిఫా, ఆతిథ్య దేశం ఆమోదించిన నిర్దిష్ట అవుట్లెట్ల ద్వారా మాత్రమే తిరిగి విక్రయించాలి. ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్ టిక్కెట్లను జారీ చేయడానికి, పంపిణీ చేయడానికి, విక్రయించడానికి ఖతార్ కు మాత్రమే ప్రత్యేక హక్కు ఉన్నది. ఈ టిక్కెట్లను రీసేల్ చేయడం చట్టరిత్యా నేరం. టిక్కెట్ల పునఃవిక్రయం ప్రక్రియను నియంత్రించే ఫిఫా చట్టాలు, విధానాలకు కట్టుబడి ఉండాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజలకు పిలుపునిచ్చింది. సంబంధిత చట్టంలోని ఆర్టికల్ (19)/రెండవ పేరాలోని నిబంధనలను ఉల్లంఘించిన వారిపై రెండు లక్షల యాభై వేల రియాల్ల కంటే ఎక్కువ జరిమానా విధించే అవకాశం ఉందని భద్రతా అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







