ఖతార్‌లో ఫిఫా ప్రపంచకప్ టిక్కెట్ల రీసేల్.. ముగ్గురు అరెస్ట్

- November 14, 2022 , by Maagulf
ఖతార్‌లో ఫిఫా ప్రపంచకప్ టిక్కెట్ల రీసేల్.. ముగ్గురు అరెస్ట్

దోహా: ఫిఫా  వరల్డ్ కప్ ఖతార్ 2022 కోసం అనధికారిక ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా టిక్కెట్‌లను రీసేల్ చేసినందుకు ఖతార్ భద్రతా అధికారులు వేర్వేరు దేశాలకు చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ప్రపంచ కప్ టిక్కెట్‌లను ఫిఫా, ఆతిథ్య దేశం ఆమోదించిన నిర్దిష్ట అవుట్‌లెట్‌ల ద్వారా మాత్రమే తిరిగి విక్రయించాలి. ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్ టిక్కెట్‌లను జారీ చేయడానికి, పంపిణీ చేయడానికి, విక్రయించడానికి ఖతార్ కు మాత్రమే ప్రత్యేక హక్కు ఉన్నది. ఈ టిక్కెట్లను రీసేల్ చేయడం చట్టరిత్యా నేరం. టిక్కెట్ల పునఃవిక్రయం ప్రక్రియను నియంత్రించే ఫిఫా చట్టాలు, విధానాలకు కట్టుబడి ఉండాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజలకు పిలుపునిచ్చింది. సంబంధిత చట్టంలోని ఆర్టికల్ (19)/రెండవ పేరాలోని నిబంధనలను ఉల్లంఘించిన వారిపై రెండు లక్షల యాభై వేల రియాల్‌ల కంటే ఎక్కువ జరిమానా విధించే అవకాశం ఉందని భద్రతా అధికారులు హెచ్చరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com