యూఏఈలో నవంబర్ 20న అంతర్జాతీయ హోమియోపతి కాన్ఫరెన్స్
- November 14, 2022
యూఏఈ: రెమీడియం 4.0 ఐహెచ్ఎంఏ (IHMA) నాల్గవ అంతర్జాతీయ హోమియోపతి కాన్ఫరెన్స్ను యూఏఈలో నిర్వహించనుంది. నవంబర్ 20న దుబాయ్ లోని స్విస్సోటెల్ అల్ మురూజ్ లో ఈ అంతర్జాతీయ హోమియోపతి కాన్ఫరెన్స్ జరగనుంది. నాలుగు సంవత్సరాల విరామం తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కోల్కతాకు చెందిన ప్రఖ్యాత హోమియోపతి ప్రాక్టీషనర్లు డాక్టర్ సప్తర్షి బెనర్జీ, కేరళలోని కోజికోడ్కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ మన్సూర్ అలీలు కాన్ఫరెన్స్లో ప్రధాన వక్తలుగా పాల్గొని డెర్మటాలజీలో హోమియోపతి పరిధిని విశ్లేషిస్తారు. అలాగే యూఏఈ, ఇండియాలకు చెందిన దాదాపు 250 మంది హోమియోపతి వైద్యులు ఈ సదస్సులో పాల్గొంటారని ఐహెచ్ఎంఏ యూఏఈ అధ్యక్షుడు, కాన్ఫరెన్స్ ఛైర్మన్ డాక్టర్ ఆల్ఫోన్స్ డిసౌజా తెలిపారు. 2002 ఫిబ్రవరిలో యూఏఈలో హోమియోపతిని చట్టబద్ధం చేశారు. అబుధాబిలో మొదటి హోమియోపతి విభాగాన్ని ఏర్పాటు చేశారు.
హోమియోపతి అనేది "సిమిలియా సిమిలిబస్ కురాంటూర్" లేదా "లైక్స్ క్యూర్ లైక్స్" సూత్రం ఆధారంగా ప్రత్యామ్నాయ ఔషధం జర్మన్ సిస్టమ్. ఇది భారతదేశంలోని ఆయుష్ వ్యవస్థలో ప్రత్యామ్నాయ, సాంప్రదాయ వైద్య వ్యవస్థలలో ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. హోమియోపతి అనేది రెండవ అతిపెద్ద వైద్య విధానం. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఆమోదించిన ఈ వైద్య విధానానికి 200 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్నది.

తాజా వార్తలు
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!









