ఒమన్కు సమీపంలో ఆయిల్ ట్యాంకర్ ని ఢీకొట్టిన డ్రోన్..
- November 17, 2022
ఒమన్: ఇరాన్తో తీవ్ర ఉద్రిక్తతల నెలకొన్న నేపథ్యంలో ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్ ను బాంబు మోసుకెళ్తున్న డ్రోన్ ఢీకొట్టింది. అయితే, ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. దాడికి గురైన నౌకను లైబీరియన్ జెండాతో కూడిన ఆయిల్ ట్యాంకర్ పసిఫిక్ జిర్కాన్గా అధికారులు గుర్తించారు. ట్యాంకర్ను సింగపూర్కు చెందిన ఈస్టర్న్ పసిఫిక్ షిప్పింగ్ నిర్వహిస్తోంది. ఇది ఇజ్రాయెలీ బిలియనీర్ ఇడాన్ ఆఫర్ యాజమాన్యంలో ఉంది. 2019 నుంచి యూఏఈ తీరంలో జరుగుతున్న వరుస దాడులకు ఇరాన్ కారణమని పలు సందర్భాల్లో అమెరికా ఆరోపించింది. అణు ఒప్పందం నుండి యుఎస్ ఏకపక్షంగా వైదొలగిన తర్వాత టెహ్రాన్ తన అణు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసినట్లు అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!







