ఒమన్కు సమీపంలో ఆయిల్ ట్యాంకర్ ని ఢీకొట్టిన డ్రోన్..
- November 17, 2022
ఒమన్: ఇరాన్తో తీవ్ర ఉద్రిక్తతల నెలకొన్న నేపథ్యంలో ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్ ను బాంబు మోసుకెళ్తున్న డ్రోన్ ఢీకొట్టింది. అయితే, ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. దాడికి గురైన నౌకను లైబీరియన్ జెండాతో కూడిన ఆయిల్ ట్యాంకర్ పసిఫిక్ జిర్కాన్గా అధికారులు గుర్తించారు. ట్యాంకర్ను సింగపూర్కు చెందిన ఈస్టర్న్ పసిఫిక్ షిప్పింగ్ నిర్వహిస్తోంది. ఇది ఇజ్రాయెలీ బిలియనీర్ ఇడాన్ ఆఫర్ యాజమాన్యంలో ఉంది. 2019 నుంచి యూఏఈ తీరంలో జరుగుతున్న వరుస దాడులకు ఇరాన్ కారణమని పలు సందర్భాల్లో అమెరికా ఆరోపించింది. అణు ఒప్పందం నుండి యుఎస్ ఏకపక్షంగా వైదొలగిన తర్వాత టెహ్రాన్ తన అణు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసినట్లు అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







