‘అన్స్టాపబుల్ 2’: ఇదేం కాంబినేషన్రా బాబూ.! అంటూ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.!
- November 17, 2022
బుల్లితెరపై బాలయ్య ప్రభంజనం ‘అన్స్టాపబుల్’ టాక్ షో. ఆహా ఓటీటీ వేదికగా ఈ టాక్ షో సక్సెస్ అయ్యింది. తొలి సీజన్ సక్సెస్ కావడంతో, మలి సీజన్ని అంతకంటే గ్రాండ్గా డిజైన్ చేసి వదిలారు.
రెండో సీజన్కి తొలి గెస్ట్గా నారా చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు లోకేష్నీ తీసుకొచ్చి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన బాలయ్య, సెకండ్ వీక్ గెస్ట్లుగా శర్వానంద్, విశ్వక్ సేన్లతో సందడి చేశాడు.
ఇక ముచ్చటగా మూడో వీక్ బాలయ్య టాక్ షో ఎవరితో వుంటుందా.? అని ఎదురు చూస్తే, అనూహ్యంగా ఆ వీక్ ఎపిసోడ్ క్యాన్సిల్ అయ్యింది. ఇక నాలుగో ఎపిసోడ్ కోసం ముచ్చటగా ముగ్గురు గెస్ట్లలను తీసుకురాబోతున్నాడు బాలయ్య.
వాళ్లెవరో కాదు సీనియర్ హీరోయిన్ రాధిక ఒకరు కాగా, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మరియు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిలను తీసుకొస్తున్నాడనీ తాజా సమాచారం.
ఈ సమాచారంతో ఇదేం కాంబినేషన్రా బాబూ..! అంటూ నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు. తొలి సీజన్ మొత్తం సినీ సెలబ్రిటీలతోనే సందడి చేసిన బాలయ్య, రెండో సీజన్కి రాజకీయ రంగు పులిమేస్తున్నారంటూ భిన్నాభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయ్.
తాజా వార్తలు
- కువైట్లో భారీగా మద్యం స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్..!!
- ఒమన్లో వైద్య ఫీజుల మినహాయింపు జాబితాలో మార్పులు..!!
- సౌదీలో తప్పుడు సమాచారం ఇస్తే ఐదేళ్ల జైలు..SR2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్లో వాట్సాప్ మెసేజ్లు, వాయిస్ మెసేజ్లు అప్పు ఆధారాలుగా పనికొస్తాయా?
- బహ్రెయిన్లో విషాదం.. బాత్టబ్లో పడి మూడేళ్ల భారతీయ బాలుడి మృతి..!!
- యూఏఈలో 52 మంది బిలియనీర్లు.. వీరి మొత్తం సంపద ఎంతంటే?
- యూఏఈలో భారతీయులకు బయోమెట్రిక్ డేటా మోసాలపై హెచ్చరిక
- మహిళ వద్ద రూ. 25 కోట్ల విలువైన 15.6 కిలోల గోల్డ్ సీజ్!
- విశాఖలో ఏఐజీ హాస్పిటల్ నిర్మాణానికి మంత్రి లోకేశ్ శంకుస్థాపన
- అల్ మెన్హాద్ ఎయిర్బేస్పై క్షిపణి దాడి.. వార్తలను ఖండించిన యూఏఈ రక్షణ శాఖ







