2023లో ప్రభుత్వ సెలవులు: నాలుగు లాంగ్ వీకెండ్లు!
- November 20, 2022
యూఏఈ: అధికారికంగా 2022లో వచ్చే చివరి అధికారిక సెలవుదినాన్ని యూఏఈ ప్రకటించింది. జాతీయ, స్మారక దినోత్సవాల కోసం డిసెంబర్ 1-3 వరకు సెలవులను యూఏఈ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అలాగే 2023లో వచ్చే సెలవులపై దృష్టి సారిస్తే.. నాలుగు లాంగ్ వీకెండ్లు వచ్చే అవకాశం ఉన్నది. జనవరి 1న నూతన సంవత్సరం సందర్భంగా వచ్చే ఏడాదిలో తొలి హాలిడే రానుంది.
ఈద్ అల్ – ఫితర్
ఈద్ అల్ – ఫితర్ ను పురస్కరించుకొని నాలుగు రోజులపాటు సెలవులు రానున్నాయి. హిజ్రీ క్యాలెండర్ ప్రకారం.. రంజాన్ 29 నుండి షవ్వాల్ 3 వరకు ఉంటాయని అంచనా. పవిత్ర రంజాన్ మాసం 2023 మార్చి 23న ప్రారంభమై 29 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఈద్ అల్ ఫితర్ మొదటి రోజు శుక్రవారం (ఏప్రిల్ 21) వచ్చే అవకాశం ఉన్నది. ఈ సెలవులు ఏప్రిల్ 23 (ఆదివారం) ముగిసే అవకాశం ఉంది. ఇస్లామిక్ క్యాలెండర్లోని తేదీల ప్రకారం.. ధుల్ హిజ్జా 9 నుండి 12 వరకు ఉంటాయి. ఎమిరేట్స్ ఆస్ట్రానమీ సొసైటీ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ ఇబ్రహీం అల్ జర్వాన్ ప్రకారం.. జూన్ 27న( మంగళవారం ) అరాఫా దినం అవ్వనుంది. ఈద్ అల్ అదా మరుసటి రోజు జూన్ 28న (బుధవారం) వస్తుంది. అంటే జూన్ 27 నుండి జూన్ 30 వరకు సెలవులు ఉండే అవకాశం ఉంది. ఇది నిజమైతే శనివారం-ఆదివారం సెలవు ఉన్న వారికి ఆరు రోజుల వీకెండ్ అవుతుంది.
హిజ్రీ నూతన సంవత్సరం (ఇస్లామిక్ నూతన సంవత్సరం)
మొహర్రం 1 హిజ్రీ ఇస్లామిక్ క్యాలెండర్ మొదటి రోజు. గ్రెగోరియన్ క్యాలెండర్లో రోజు సెలవు తేదీకి దగ్గరగా ప్రకటించబడుతుంది.
ప్రవక్త ముహమ్మద్ పుట్టినరోజు
ప్రవక్త ముహమ్మద్ (స) పుట్టినరోజు రబీ అల్ అవ్వల్ 12వ తేదీన జరుపుకుంటారు. ఇస్లామిక్ క్యాలెండర్ మూడవ నెల. గ్రెగోరియన్ క్యాలెండర్లో రోజు సెలవు తేదీకి దగ్గరగా ప్రకటించబడుతుంది.
స్మారక, జాతీయ దినోత్సవాలు
యూఏఈ సంస్మరణ, జాతీయ దినోత్సవాలను డిసెంబర్ 1 నుండి 3 వరకు సెలవులు ఉంటాయి. 2023లో ఇది మూడు రోజుల వీకెండ్ (శుక్రవారం నుండి ఆదివారం) కానుంది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







