ఇరాక్‌లో ఉగ్ర దాడి.. నలుగురు సైనికులు మృతి

- November 20, 2022 , by Maagulf
ఇరాక్‌లో ఉగ్ర దాడి.. నలుగురు సైనికులు మృతి

బాగ్దాద్: ఇరాక్‌లోని కిర్కుక్‌ నగరానికి సమీపంలోని చెక్‌పోస్టును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో అక్కడ విధుల్లో ఉన్న సైనికులు ఎదురు కాల్పులు జరిపారు.ఈ కాల్పుల్లో నలుగురు సైనికులు చనిపోయినట్లు అధికారులు తెలిపారు.బాంబులతో దాడులు జరిపిన ఉగ్రవాదులు సైనికుల వద్ద ఉన్న ఆయుధాలు, కమ్యునికేషన్‌ పరికరాలను ఎత్తుకెళ్లారు.

దాదాపు 10 నెలల క్రితం జనవరిలో కూడా ఇదే తరహా దాడి జరిగింది. క్యూబా నగరంలోని అల్-అజీమ్ జిల్లాలోని బ్యారక్‌లను ఐఎస్ ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. నిద్రిస్తున్న సైనికులపై విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ఓ గార్డుతోపాటు 11 మంది సైనికులు మరణించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com