CBSE 10+2 ఫార్మాట్ రద్దు.. దానిస్థానంలో 5+3+3+4 స్ట్రక్చర్!
- November 21, 2022
కువైట్: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ) 2020 సిఫార్సుల ఆధారంగా.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) వచ్చే విద్యా సంవత్సరానికి కొత్త ఫార్మాట్ను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 10+2 విధానాన్ని తొలగించాలని యోచిస్తున్నట్లు తెలిపింది. దాని స్థానంలో 5+3+3+4 విద్యా విధానాన్ని ప్రకటించనుందని సమాచారం. త్వరలోనే కొత్త విధానానికి మారేందుకు అవసరమైన నిబంధనల రూపకల్పన కోసం ఓ కమిటీని వేయనున్నట్లు సమాచారం. NEP 2020లోని కొత్త బోధనా నిర్మాణం పిల్లల విద్యను నాలుగు దశలుగా విభజించింది. మొదటిది ఐదు సంవత్సరాల ఫౌండేషన్ దశ, ప్రిపరేటరీ, మిడిల్ దశలు ఒక్కొక్కటి మూడు సంవత్సరాలు ఉండనుంది. ఇక సెకండరీ దశ నాలుగు సంవత్సరాలు ఉంటుంది. NEPలో భాగంగా 10 నుండి 12 తరగతులకు బోర్డ్ పరీక్షలు కొనసాగుతుండగా.. కోచింగ్ తరగతుల అవసరాన్ని తొలగించడానికి ఈ పరీక్షల విధానంలో మార్పు చేయనున్నారు. NEP ప్రకారం.. విద్యార్థులు విద్యా సంవత్సరంలో రెండు పర్యాయాలు పరీక్షలు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!