ఒమన్ ఎయిర్.. 65% ప్రీ-పాండమిక్ నెట్వర్క్ పునరుద్ధరణ
- November 21, 2022
మస్కట్ : ఒమన్ ఎయిర్ తన ప్రీ-పాండమిక్ నెట్వర్క్లో 65 శాతం పునరుద్ధరణ జరిగిందని ఒమన్ ఎయిర్ సీఈఓ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ అల్ రైసీ తెలిపారు. 2023 చివరి నుండి 2024 ప్రారంభం మధ్య ఫ్లీట్ , గమ్యస్థానాలకు సంబంధించిన పూర్తి కార్యకలాపాలు తిరిగి పూర్తి స్థాయిలో ప్రారంభం అయ్యాయని తెలిపారు. మొరాకో, చైనా మినహా కొవిడ్-19 మహమ్మారి సమయంలో నిలిపివేయబడిన గమ్యస్థానాల నెట్వర్క్లోని చాలా మార్గాలను ఎయిర్లైన్ ఇప్పటికే పునఃప్రారంభించిందని వెల్లడించారు. డిసెంబర్ నుండి మాస్కోకు విమానాలను తిరిగి ప్రారంభించనున్నట్లు.. 2023లో మరిన్ని గమ్యస్థానాలను ప్రారంభించే ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయన్నారు. ఇంధన ధరల పెరుగుదల, రష్యా-ఉక్రేనియన్ సంక్షోభం, అనేక అంతర్జాతీయ విమానాశ్రయాలలో వర్తించే చర్యలు కంపెనీ ఆదాయాలను గణనీయంగా ప్రభావితం చేశాయని రైసీ తెలిపారు. ఒమానిసేషన్పై, ఒమానీ యువతకు శిక్షణ ఇవ్వడంలో, ప్రత్యేకించి ఉపాధి సంబంధిత శిక్షణ రంగంలో కంపెనీ గణనీయంగా పెట్టుబడి పెడుతుందని రైసీ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- యూరప్కు అక్రమంగా తరలిస్తున్న 7 కోట్ల సిగరెట్లను అడ్డుకున్న దుబాయ్ కస్టమ్స్
- ADNOC నౌక పై ఇరాన్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!







