తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి
- November 21, 2022
తెలంగాణ: వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముమ్మళ్ళపల్లి జాతీయ రహదారిపై ట్రాక్టర్ను వెనుక నుంచి గరుడ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా , 16 మందికి గాయాలు అయ్యాయి. కొత్తకోట మండలంలోని ముమ్మాళ్లపల్లి వద్ద నేషనల్ హైవేపై చెరకులోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను వెనక నుంచి ఆర్టీసీ గరుడ బస్సు బలంగా ఢీకొట్టింది. ఆదివారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు దుర్మరణం పాలవ్వగా.. 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. గాయపడిన బాధితులను పోలీసులు అంబులెన్స్లో వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. మియాపూర్ డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో క్లీనర్ సందీప్, డ్రైవర్ ఆంజనేయులతో పాటు ప్రయాణికుడు శివన్న ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రోడ్డు ప్రమాదం వల్ల ముమ్మాళ్ళపల్లి నుండి అమడబాకుల వరకు జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
తాజా వార్తలు
- ట్యాంక్ బండ్ శివకు సీఎం భారీ సాయం
- స్కాలర్ షిప్ దరఖాస్తు గడువు 20 వరకు పొడిగింపు
- AN-26 విమానం కుప్పకూలి 29 మంది దుర్మరణం
- కువైట్ లో ఉగ్రవాద విచారణలు వేగవంతం..!!
- యూఏఈలో పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ లైన్లు..!!
- కువైట్కు కొత్త బస్సు మార్గాలను ప్రకటించిన సౌదీ..!!
- మస్కట్లో డిస్టన్స్ లెర్నింగ్ ప్రారంభం..!!
- ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాలను రెచ్చగొడుతుంది..!!
- రక్షణ సహకారం పై ఖతార్ ప్రధాని, యూకే రక్షణ కార్యదర్శి చర్చలు..!!
- గుజరాత్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం









