తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి
- November 21, 2022తెలంగాణ: వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముమ్మళ్ళపల్లి జాతీయ రహదారిపై ట్రాక్టర్ను వెనుక నుంచి గరుడ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా , 16 మందికి గాయాలు అయ్యాయి. కొత్తకోట మండలంలోని ముమ్మాళ్లపల్లి వద్ద నేషనల్ హైవేపై చెరకులోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను వెనక నుంచి ఆర్టీసీ గరుడ బస్సు బలంగా ఢీకొట్టింది. ఆదివారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు దుర్మరణం పాలవ్వగా.. 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. గాయపడిన బాధితులను పోలీసులు అంబులెన్స్లో వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. మియాపూర్ డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో క్లీనర్ సందీప్, డ్రైవర్ ఆంజనేయులతో పాటు ప్రయాణికుడు శివన్న ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రోడ్డు ప్రమాదం వల్ల ముమ్మాళ్ళపల్లి నుండి అమడబాకుల వరకు జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు