భారత్ వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ‘ఎయిర్ సువిధ’ రద్దు
- November 21, 2022
న్యూఢిల్లీ: భారత్ కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు భారత ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొవిడ్ 19 వ్యాప్తి సమయంలో అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ప్రవేశపెట్టిన ఎయిర్ సువిధ ఫారాలను భారత ప్రభుత్వం రద్దు చేసింది. ఎయిర్ సువిధ అనేది పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా తీసుకొచ్చిన కాంటాక్ట్లెస్ ప్రక్రియ(సెల్ఫ్ డిక్లరేషన్). భారతదేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులందరు ఈ ఫారాన్ని నింపాల్సి ఉంటుంది. భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం.. స్వీయ-డిక్లరేషన్ ఫారమ్ రద్దు నిర్ణయం నవంబర్ 22 నుండి అమల్లోకి రానుంది. ఇకపై విదేశాల నుండి భారతదేశానికి వెళ్లే వ్యక్తులు ఎయిర్ సువిధ ఫారమ్ను పూరించాల్సిన అవసరం లేదు. అలాగే ఆర్టీ-పీసీఆర్ పరీక్షను కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







