భారత్ వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ‘ఎయిర్ సువిధ’ రద్దు
- November 21, 2022
న్యూఢిల్లీ: భారత్ కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు భారత ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొవిడ్ 19 వ్యాప్తి సమయంలో అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ప్రవేశపెట్టిన ఎయిర్ సువిధ ఫారాలను భారత ప్రభుత్వం రద్దు చేసింది. ఎయిర్ సువిధ అనేది పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా తీసుకొచ్చిన కాంటాక్ట్లెస్ ప్రక్రియ(సెల్ఫ్ డిక్లరేషన్). భారతదేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులందరు ఈ ఫారాన్ని నింపాల్సి ఉంటుంది. భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం.. స్వీయ-డిక్లరేషన్ ఫారమ్ రద్దు నిర్ణయం నవంబర్ 22 నుండి అమల్లోకి రానుంది. ఇకపై విదేశాల నుండి భారతదేశానికి వెళ్లే వ్యక్తులు ఎయిర్ సువిధ ఫారమ్ను పూరించాల్సిన అవసరం లేదు. అలాగే ఆర్టీ-పీసీఆర్ పరీక్షను కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







