బెస్ట్ ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ అవార్డు దక్కించుకున్న మెగాస్టార్ చిరంజీవి.!
- November 21, 2022
53వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ అవార్డుల్లో బెస్ట్ ఇండియన్ పర్సనాలిటీ అవార్డు ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవిని వరించింది. గతంలో బిగ్బి అమితాబ్ బచ్చన్, హేమా మాలినీ, రజనీకాంత్, ఇళయరాజా తదితరులు దక్కించుకున్న ఈ అరుదైన పురస్కారం ఈ సారి మెగాస్టార్ చిరంజీవిని వరించింది.
ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలియ జేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ సందర్భంగా చిరంజీవికి ప్రత్యేక అభినందనలు తెలపడం విశేషం. ఎందరో హేమా హేమీలను వరించిన ఈ అరుదైన పురస్కారం అన్నయ్య దక్కించుకోవడం ఎంతో ఆనందంగా వుందని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు.
టాలీవుడ్ మెగాస్టార్ అయిన చిరంజీవికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. 150 సినిమాలకు పైగా నటించి తనకంటూ ప్రత్యేకమైన అభిమానాన్ని దక్కించుకున్న చిరంజీవి ఈ అవార్డు దక్కడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, చిరంజీవి నటించిన ‘వాల్తేర్ వీరయ్య’ చిత్రం ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 23న ‘బాస్ పార్టీ’ పేరుతో ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







