బెస్ట్ ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ అవార్డు దక్కించుకున్న మెగాస్టార్ చిరంజీవి.!
- November 21, 2022
53వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ అవార్డుల్లో బెస్ట్ ఇండియన్ పర్సనాలిటీ అవార్డు ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవిని వరించింది. గతంలో బిగ్బి అమితాబ్ బచ్చన్, హేమా మాలినీ, రజనీకాంత్, ఇళయరాజా తదితరులు దక్కించుకున్న ఈ అరుదైన పురస్కారం ఈ సారి మెగాస్టార్ చిరంజీవిని వరించింది.
ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలియ జేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ సందర్భంగా చిరంజీవికి ప్రత్యేక అభినందనలు తెలపడం విశేషం. ఎందరో హేమా హేమీలను వరించిన ఈ అరుదైన పురస్కారం అన్నయ్య దక్కించుకోవడం ఎంతో ఆనందంగా వుందని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు.
టాలీవుడ్ మెగాస్టార్ అయిన చిరంజీవికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. 150 సినిమాలకు పైగా నటించి తనకంటూ ప్రత్యేకమైన అభిమానాన్ని దక్కించుకున్న చిరంజీవి ఈ అవార్డు దక్కడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, చిరంజీవి నటించిన ‘వాల్తేర్ వీరయ్య’ చిత్రం ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 23న ‘బాస్ పార్టీ’ పేరుతో ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది.
తాజా వార్తలు
- ఏపీ బడ్జెట్ 2026-27: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
- అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాను ఛేదించిన యూఏఈ, కువైట్..!!
- కువైట్ ఎంబసీలో నేషనల్, లిబరేషన్ డే సెలబ్రేషన్స్..!!
- GCC లో పనిచేసే బహ్రెయిన్లకు నిరుద్యోగ బీమా..!!
- ఖసాబ్ లో భూకంపం వివరాలు వెల్లడి..!!
- ఖతార్ లో రెండు రోజులపాటు స్ట్రాంగ్ విండ్స్..!!
- గాజా సంక్షోభం .. గ్లోబల్ వైఫల్యం: సౌదీ FM
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా...మెజారిటీ స్థానాలు కైవసం
- కెనడా పై యూఏఈ విజయం









