కారులో భారతదేశం నుండి ఖతార్ చేరిన కేరళ కుటుంబం
- November 23, 2022
యూఏఈ: కేరళకు చెందిన కెవిటి అష్రఫ్కు ఫుట్బాల్, ప్రయాణం అంటే చాలా మక్కువ. ఫిఫా ప్రపంచ కప్లో మ్యాచ్లను చూడటానికి గత 23 రోజులపాటు రోడ్డు మార్గన ప్రయాణించి అష్రఫ్, అతని కుటుంబం ఖతార్ చేరుకోన్నది. అష్రఫ్, అతని భార్య షహనాస్, అతని కుమారుడు అబ్దుల్లా ఇబ్ను అష్రఫ్, అతని మేనల్లుడు మొహమ్మద్ ఫరాజ్ అక్టోబర్ 30న దక్షిణ భారతదేశంలోని కన్నూర్ పట్టణం నుండి తమ టయోటా ఇన్నోవాలో బయలుదేరారు. రెండు వారాల పాటు భారతదేశం గుండా ప్రయాణించిన తర్వాత.. కుటుంబం గత వారం దుబాయ్ చేరుకుంది. అక్కడ అష్రాఫ్ కుమార్తె అక్సానా బీగం, ఆమె భర్త ఇర్ఫాన్ వారితో చేరారు. యూఏఈ నుండి బయలుదేరి ఒమన్, బహ్రెయిన్, కువైట్ , సౌదీ మీదుగా ఖతార్ చేరుకున్నది. ఖతార్లో నివాసముంటున్న ఫరాజ్ తల్లిదండ్రులను కలుసుకోవడం యాత్ర దిగ్విజయంగా ముగిసింది. డిసెంబరు 1న జర్మనీ, కోస్టా రైస్తో తలపడటాన్ని చూసేందుకు కుటుంబం టిక్కెట్లను బుక్ చేసుకుంని అష్రఫ్ తెలిపారు. అలాగే క్వార్టర్-ఫైనల్, సెమీఫైనల్లకు కూడా టిక్కెట్ల కోసం ప్రయత్నిస్తున్నట్లు ఇర్ఫాన్ వెల్లడించారు.
తాజా వార్తలు
- మహిళను చంపిన పూజారికి శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు
- లైసెన్స్ లేకుండా సేవలందిస్తే..SR2,600 ఫైన్..!!
- విడాకుల కేసులు పెరగడంపై షురా కౌన్సిల్ ఆందోళన..!!
- అలెర్ట్..ఉమ్ అల్ హౌల్ ఇంటర్చేంజ్లో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఆన్లైన్ బెగ్గింగ్ మోసాలపై దుబాయ్ పోలీసుల వార్న్..!!
- రమదాన్..ధరల పర్యవేక్షణకు ముమ్మర తనిఖీలు..!!
- కింగ్ ఫైసల్ రోడ్డులో రెండు లేన్లు మార్చి 29 వరకు మూసివేత..!!
- T20WorldCup2026: ఆస్ట్రేలియా ఇంటికే..!
- ఢిల్లీలో AI సమ్మిట్ ప్రారంభం
- కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లు వీళ్లే









