ఢిల్లీలో AI సమ్మిట్ ప్రారంభం
- February 16, 2026
న్యూ ఢిల్లీ: ఢిల్లీలో “ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026” ఘనంగా ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ (AI) వినియోగం, సమ్మిళిత వృద్ధి మరియు సుస్థిర అభివృద్ధిలో దాని పాత్రపై ఈ సదస్సులో విస్తృత చర్చలు జరుగనున్నాయి. 80కి పైగా దేశాల ప్రతినిధులు, 500 మందికి పైగా గ్లోబల్ ఏఐ నిపుణులు, సీఈఓలు, పరిశోధకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. గ్లోబల్ సౌత్లో ఈ స్థాయిలో ఏఐపై సదస్సు నిర్వహించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
ఈ సమ్మిట్ ఫిబ్రవరి 20 వరకు కొనసాగుతుంది. ఫిబ్రవరి 19న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం చేయనున్నారు. సమ్మిళిత, బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధిపై భారత్ దృష్టికోణం, అంతర్జాతీయ సహకారంపై ఆయన ప్రసంగంలో దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. ఈ సదస్సులో 20 దేశాల అధినేతలు, 60 మంది మంత్రులు మరియు ఉప మంత్రులు పాల్గొంటున్నారు.
సమ్మిట్లో భాగంగా నిర్వహిస్తున్న “AI for All”, “AI by Her”, “Yuva AI” గ్లోబల్ ఇంపాక్ట్ ఛాలెంజ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ పోటీలకు 60 దేశాల నుంచి 4,650కి పైగా దరఖాస్తులు రావడం, బాధ్యతాయుత ఏఐ ఆవిష్కరణల్లో భారత్ గ్లోబల్ హబ్గా (India AI Impact) ఎదుగుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. ఫైనల్కు ఎంపికైన 70 బృందాలు ఫిబ్రవరి 16–17 తేదీల్లో భారత్ మండపం, సుష్మా స్వరాజ్ భవన్లలో తమ ఆవిష్కరణలను ప్రదర్శించనున్నాయి.
ఫిబ్రవరి 18న ఐఐటీ హైదరాబాద్ భాగస్వామ్యంతో “ఏఐ మరియు దాని ప్రభావం” అంశం పై రీసెర్చ్ సింపోజియం నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమానికి కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్, ఎస్టోనియా అధ్యక్షుడు అలర్ కారిస్ సహా ప్రముఖులు హాజరవుతున్నారు.ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పరిశోధనా సంస్థలు, ఏఐ నిపుణులు ఇందులో పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.
తాజా వార్తలు
- T20WorldCup2026: ఆస్ట్రేలియా ఇంటికే..!
- ఢిల్లీలో AI సమ్మిట్ ప్రారంభం
- కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లు వీళ్లే
- 'రాయల్' ఫోటోగ్రాఫర్ రమేష్ శుక్లాకు షేక్ హమ్దాన్ నివాళి..!!
- ఒమన్ లో పోలీసుల అధికారిక వర్కింగ్ అవర్స్ ఇవే..!!
- సౌదీలో డొమెక్టిక్ వర్కర్స్ తొలగింపునకు అనుమతి..!!
- బహ్రెయిన్ వార్షిక ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- ఖతార్ లో ఆహార సంస్థల పై నిఘా ముమ్మరం..!!
- రమదాన్..మస్జీదులలో కె-నెట్ పరికరాలపై నిషేధం..!!
- అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కీలక పొలిటికల్ హామీ









