సులేమానియా -బలాద్ మధ్య రోజూ 42 హై-స్పీడ్ రైల్ షటిల్ సర్వీసులు
- November 23, 2022
జెడ్డా: హరమైన్ హై-స్పీడ్ రైలు.. సులేమానియా స్టేషన్, జెడ్డా నగరంలోని బలాద్ డౌన్టౌన్ ప్రాంతం మధ్య షటిల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సర్వీసులను ప్రారంభించినట్లు జెడ్డా ట్రాన్స్పోర్ట్ కంపెనీ ప్రకటించింది. బలాద్, సులేమానియా స్టేషన్ మధ్య 42 షటిల్ సర్వీసులను నిర్వహిస్తుందన్నారు. వన్-వే ప్రయాణానికి నామమాత్రపు ఛార్జీ SR3.45ని నిర్ణయించినట్లు తెలిపింది. ప్రతి 50 నిమిషాలకు ఒక సర్వీసు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందన్నారు. బస్సు సర్వీస్ ఆపరేటింగ్ సమయం రోజుకు 17 గంటలు అని.. ఉదయం 7.15 నుండి రాత్రి 12.00 గంటల వరకు సర్వీసులు అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. బలాద్లోని హిస్టారిక్ ఏరియా నుండి బగ్దాదియా, కింగ్ అబ్దుల్ అజీజ్ యూనివర్శిటీ, అల్-సలామ్ మాల్ మీదుగా రౌండ్ ట్రిప్ మొదలవుతుందని తెలిపింది. చివరకు సులేమానియా స్టేషన్లో, ఆపై తిరిగి అదే ట్రాక్లో బలాద్కు చేరుకుంటుందని వివరించింది. వికలాంగుల కోసం కేటాయించిన స్థలాలు, ట్రావెల్ బ్యాగుల కోసం నిర్దేశించిన స్థలాలతో పాటు 33 మంది ప్రయాణికులు ప్రయాణించే సామర్థ్యంతో బస్సులను రూపొందించినట్లు తెలిపారు. ట్రిప్ కోసం ప్రత్యేక సేల్స్ పాయింట్ల ద్వారా లేదా SAPTCO చెల్లింపు అప్లికేషన్ని ఉపయోగించడం ద్వారా కొనుగోలు చేయవచ్చని జెడ్డా ట్రాన్స్పోర్ట్ కంపెనీ తెలిపింది.
తాజా వార్తలు
- నెదర్లాండ్స్ పై భారత్ విజయం
- హైదరాబాద్లో హాట్ కేకుల్లా అమ్ముడైన హౌసింగ్ బోర్డు ప్లాట్లు
- ఏపీ: ఫిబ్రవరి 24న మంత్రివర్గ సమావేశం
- ఏప్రిల్ లో ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక
- సోషల్ మీడియాలో ‘ఓవర్ షేరింగ్’ చేస్తే డేంజర్ లో పడినట్లే!!
- రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల..
- తెలంగాణ వైద్యారోగ్య శాఖలో సరికొత్త స్కామ్!
- ప్రధాని నరేంద్ర మోదీతో సుందర్ పిచాయ్ భేటీ
- కువైట్ అంతటా మస్జీదుల్లో సందడి..!!
- అనుచిత సోషల్ మీడియా పోస్ట్ లపై స్కూల్స్ వార్న్..!!









