ధోఫర్‌లో నవంబర్ 28 నుండి సుగంధ ద్రవ్యాల సీజన్ ప్రారంభం

- November 25, 2022 , by Maagulf
ధోఫర్‌లో నవంబర్ 28 నుండి సుగంధ ద్రవ్యాల సీజన్ ప్రారంభం

మస్కట్: ధోఫర్ గవర్నరేట్‌లో సుగంధ ద్రవ్యాల సీజన్ నవంబర్ 28 నుంచి ప్రారంభమవుతుంది. ఇది డిసెంబర్ 2 వరకు కొనసాగుతుందని మినిస్ట్రీ ఆఫ్ హెరిటేజ్ అండ్ టూరిజం (MHT) ప్రకటించింది. అల్ బలీద్ ఆర్కియోలాజికల్ పార్క్, సంహ్రామ్ ఆర్కియోలాజికల్ పార్క్, వాడి డోకా నేచర్ రిజర్వ్‌లోని ల్యాండ్ ఆఫ్ ఫ్రాంకిన్సెన్స్ సైట్‌లలో ఈ సీజన్ ను నిర్వహించనున్నారు. ధోఫర్‌లోని హెరిటేజ్ అండ్ టూరిజం డైరెక్టర్ జనరల్ ఖలీద్ అబ్దుల్లా అల్ అబ్రి మాట్లాడుతూ..ఈ సీజన్‌లో సుల్తానేట్‌లోని ప్రముఖ కంపెనీలు తయారుచేసిన సుగంధ ద్రవ్యాలు, ఒమానీ సుగంధ ఉత్పత్తుల ప్రదర్శనను ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. దీంతోపాటు ఖోర్ రోరి ఫోటోగ్రాఫ్‌ల ప్రదర్శన ఉంటుందన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com