స్టాక్ మార్కెట్లలో వ్యాపారాల్ని సులభతరం
- April 24, 2016
స్టాక్ మార్కెట్లలో వ్యాపారాల్ని సులభతరం చేయడానికి సెబీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగా బ్రోకరేజీ సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్, పోర్టుఫోలియో మేనేజర్లు తదితరాల రిజిస్ట్రేషన్లను ఆన్లైన్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆయా సంస్థల తనిఖీలు, కార్యాచరణ నివేదికలను కూడా ఆన్లైన్ పంపించే ఏర్పాటు చేయనుంది.ఇప్పటి వరకు సెబీ కమోడిటీ డెరివేటివ్ బ్రోకర్లకు మాత్రమే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని కల్పించింది. ఇప్పుడు ఇటువంటి సౌకర్యాన్నే ఈక్విటీ బ్రోకర్లకు కూడా కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనిని అన్ని రకాల బ్రోకరేజీలకు విస్తరించనుంది. కొత్తగా మార్కెట్లోకి వచ్చే వారికి.. ఇప్పటికే మార్కెట్లో ఉన్నవారికి సెబీకి సంబంధించిన వ్యవహారాలను త్వరగా పూర్తి చేసుకునేందుకు ఇది తోడ్పడుతుంది.ఈ పద్దతితో భవిష్యత్తులో బ్రోకర్స్, మర్చెంట్ బ్రోకర్స్, డిబెంచర్ ట్రస్టీలు, మ్యూచువల్ ఫండ్స్, డొమెస్టిక్, విదేశీ పోర్టుఫోలియో మేనేజర్లు, రేటింగ్ ఏజెన్సీలు, రిజిస్టర్ అండ్ షేర్ ట్రాన్స్ఫర్ ఏజంట్లు, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, డిపాజిటరీ భాగస్వాములు, ఇన్వెస్టర్ అసోసియేషన్స్, రీసెర్చి ఎనలిస్ట్లు, వెంచర్ కాపిటల్ ఫండ్స్, కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ తదితరాలు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కిందకు వచ్చే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







