నాన్ ఏసీ స్లీపర్ కొత్త సర్వీసులు ప్రారంభించిన APSRTC
- November 29, 2022
అమరావతి: ప్రయాణికుల కోసం APSRTC నాన్ ఏసీ స్లీపర్ కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చింది. వివిధ జిల్లాల నుంచి ఈ సర్వీసులకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ నాన్ ఏసీ స్లీపర్ బస్సులైన స్టార్ లైనర్స్ విజయవాడ-విశాఖపట్నం మధ్య మొదలయ్యాయి. విజయవాడలో తొలి సర్వీసు 9330 నెంబరుతో ప్రారంభమైంది. విజయవాడ నుంచి రాత్రి 11 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు విశాఖ చేరుకుంటుంది. అలాగే మరికొన్ని జిల్లాల నుంచి కూడా ఈ సర్వీసులు ప్రారంభమయ్యాయి.
విజయవాడ-విశాఖపట్నం ఎగువ బెర్త్ పెద్దలకు రూ.860, పిల్లలకు రూ.660, దిగువ బెర్త్ రూ.930-రూ.720గా నిర్ణయించారు. విజయవాడ – అన్నవరం ఎగువ బెర్త్ పెద్దలకు రూ. 580, పిల్లలకు రూ.490; దిగవ బెర్త్ రూ.630-రూ.450 ను ఛార్జీలుగా ఫిక్స్ చేశారు. ఇందులో బస్సు 2+1 స్లీపర్ కోచ్, 30 కుషన్ సాఫ్ట్ బెర్త్లు ఉండనున్నాయి. అలాగే ఛార్జింగ్ పోర్ట్స్, రీడింగ్ లాంప్స్, లగేజీ ర్యాక్స్, ఆడియో కోచ్ సౌకర్యాలు కూడా ఉండనున్నాయి. APSRTC తీసుకువచ్చిన ఈ నాన్ ఏసీ స్లీపర్ బస్సులు దూర ప్రాంత ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడనున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!







