నాన్ ఏసీ స్లీపర్ కొత్త సర్వీసులు ప్రారంభించిన APSRTC
- November 29, 2022
అమరావతి: ప్రయాణికుల కోసం APSRTC నాన్ ఏసీ స్లీపర్ కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చింది. వివిధ జిల్లాల నుంచి ఈ సర్వీసులకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ నాన్ ఏసీ స్లీపర్ బస్సులైన స్టార్ లైనర్స్ విజయవాడ-విశాఖపట్నం మధ్య మొదలయ్యాయి. విజయవాడలో తొలి సర్వీసు 9330 నెంబరుతో ప్రారంభమైంది. విజయవాడ నుంచి రాత్రి 11 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు విశాఖ చేరుకుంటుంది. అలాగే మరికొన్ని జిల్లాల నుంచి కూడా ఈ సర్వీసులు ప్రారంభమయ్యాయి.
విజయవాడ-విశాఖపట్నం ఎగువ బెర్త్ పెద్దలకు రూ.860, పిల్లలకు రూ.660, దిగువ బెర్త్ రూ.930-రూ.720గా నిర్ణయించారు. విజయవాడ – అన్నవరం ఎగువ బెర్త్ పెద్దలకు రూ. 580, పిల్లలకు రూ.490; దిగవ బెర్త్ రూ.630-రూ.450 ను ఛార్జీలుగా ఫిక్స్ చేశారు. ఇందులో బస్సు 2+1 స్లీపర్ కోచ్, 30 కుషన్ సాఫ్ట్ బెర్త్లు ఉండనున్నాయి. అలాగే ఛార్జింగ్ పోర్ట్స్, రీడింగ్ లాంప్స్, లగేజీ ర్యాక్స్, ఆడియో కోచ్ సౌకర్యాలు కూడా ఉండనున్నాయి. APSRTC తీసుకువచ్చిన ఈ నాన్ ఏసీ స్లీపర్ బస్సులు దూర ప్రాంత ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడనున్నాయి.
తాజా వార్తలు
- భారత్తో సహా 10 దేశాలను సుంకాలతో టార్గెట్ చేసిన ట్రంప్
- ఎన్టీఏ డైరెక్టర్గా ఏపీ కేడర్ ఐఏఎస్కు కీలక బాధ్యతలు
- రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం
- నేపాల్కు మరో భారీ వరద ముప్పు: చైనా తీవ్ర హెచ్చరికలు!
- ‘మన దేశ గర్వకారణం’.. ఎమిరాతీ మహిళల సేవలను కొనియాడిన షేక్ మొహమ్మద్
- గ్రాండ్ చెస్ టూర్ విజేతగా ప్రజ్ఞానంద రికార్డ్!
- నేపాల్లో వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒమన్..!!
- కువైట్లో భారీ డ్రగ్స్ రాకెట్ ఆపరేషన్ భగ్నం..!!
- లైసెన్స్ లేకుండా వన్యప్రాణుల వేట.. నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్..!!
- అనుమతి లేని పెప్టైడ్ ఉత్పత్తులపై ఖతార్ నిషేధం..!!







