నాన్ ఏసీ స్లీపర్ కొత్త సర్వీసులు ప్రారంభించిన APSRTC
- November 29, 2022
అమరావతి: ప్రయాణికుల కోసం APSRTC నాన్ ఏసీ స్లీపర్ కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చింది. వివిధ జిల్లాల నుంచి ఈ సర్వీసులకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ నాన్ ఏసీ స్లీపర్ బస్సులైన స్టార్ లైనర్స్ విజయవాడ-విశాఖపట్నం మధ్య మొదలయ్యాయి. విజయవాడలో తొలి సర్వీసు 9330 నెంబరుతో ప్రారంభమైంది. విజయవాడ నుంచి రాత్రి 11 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు విశాఖ చేరుకుంటుంది. అలాగే మరికొన్ని జిల్లాల నుంచి కూడా ఈ సర్వీసులు ప్రారంభమయ్యాయి.
విజయవాడ-విశాఖపట్నం ఎగువ బెర్త్ పెద్దలకు రూ.860, పిల్లలకు రూ.660, దిగువ బెర్త్ రూ.930-రూ.720గా నిర్ణయించారు. విజయవాడ – అన్నవరం ఎగువ బెర్త్ పెద్దలకు రూ. 580, పిల్లలకు రూ.490; దిగవ బెర్త్ రూ.630-రూ.450 ను ఛార్జీలుగా ఫిక్స్ చేశారు. ఇందులో బస్సు 2+1 స్లీపర్ కోచ్, 30 కుషన్ సాఫ్ట్ బెర్త్లు ఉండనున్నాయి. అలాగే ఛార్జింగ్ పోర్ట్స్, రీడింగ్ లాంప్స్, లగేజీ ర్యాక్స్, ఆడియో కోచ్ సౌకర్యాలు కూడా ఉండనున్నాయి. APSRTC తీసుకువచ్చిన ఈ నాన్ ఏసీ స్లీపర్ బస్సులు దూర ప్రాంత ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడనున్నాయి.
తాజా వార్తలు
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్కోచ్లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు
- ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ









