ఒమన్ మిస్సింగ్ మహిళ హమిదా మృతదేహం లభ్యం
- November 29, 2022
మస్కట్: 55 రోజుల క్రితం తప్పిపోయిన ఒమన్ పౌరురాలు హమిదా బింట్ హమ్మూద్ అల్ అమ్రీ కథ విషాదాంతంగా ముగిసింది. ఆమె మృతదేహాన్ని సోమవారం కనుగొన్నట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. హమిదా బింట్ హమ్మూద్ అల్ అమ్రి మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులకు అప్పగించేందుకు ప్రక్రియ కొనసాగుతోందని ఆర్ఓపీ తెలిపింది. రాయల్ ఒమన్ పోలీస్ మరణించిన వారి కుటుంబానికి తన సంతాపాన్ని తెలియజేసింది. ఆమె కోసం గాలింపు కార్యకలాపాలలో పాల్గొన్న స్వచ్ఛంద బృందాలు, పౌరులకు అభినంనలు తెలపింది. 57 ఏళ్ల పౌరురాలు హమిదా బింట్ హమ్మూద్ అల్ అమ్రీ, అల్ దఖిలియా గవర్నరేట్లోని ఇజ్కిలోని తన ఇంటి నుంచి అక్టోబర్ 3( సోమవారం) తప్పిపోయిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- వైభవంగా ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక.. చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ సందడి..
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్కోచ్లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు









