ఏపీ పోలీసుల తీరు పై చంద్రబాబు ఆగ్రహం...
- December 01, 2022
అమరావతి: పోలవరం దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలోనే రోడ్డుపై చంద్రబాబు నాయుడు కాసేపు తమ పార్టీ నేతలతో కలిసి బైఠాయించారు. తాను పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తానని, అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాంతం వద్దకు టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. పోలీసుల తీరు పట్ల చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొత్త కొత్త జీవోలతో మభ్య పెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం సందర్శనకు వచ్చినా అడ్డుకోవడం ఏంటని ఆయన నిలదీశారు. మావోయిస్టుల నుంచి ముప్పు ఉందంటూ అడ్డుకుంటున్నారని, అలాగైతే పోలవరానికి ఎప్పుడు రావాలని చెబుతారో అప్పుడే వస్తానని చెప్పారు.
పోలవరం ప్రాజెక్టు 72 శాతం పనులను తామే పూర్తి చేశామని, డయాఫ్రంవాల్ ఏమైందో తెలియదని చంద్రబాబు అన్నారు. కమీషన్ల కోసం ప్రాజెక్టును నాశనం చేశారని చెప్పారు. ప్రభుత్వం 3 డెడ్ లైన్లు మార్చినప్పటికీ కనీసం 3 శాతం పనులను కూడా పూర్తి చేయలేదని అన్నారు. పోలవరం నిర్వాసితుల త్యాగాలను వెలకట్టలేమని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే పోలవరాన్ని ప్రత్యక జిల్లాగా చేసి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







