బహ్రెయిన్ లో ఘనంగా గీతా జయంతి వేడుకలు

- December 04, 2022 , by Maagulf
బహ్రెయిన్ లో ఘనంగా గీతా జయంతి  వేడుకలు

మనామా: గీతాజయంతి సందర్బంగా ఇస్కాన్ మందిరంలో భగవద్గీత లోని 18ఆధ్యాయములు పారాయణం చేశారు. ప్రతి ఒకరు గీత గురించి తమ తమ భావాలను వ్యక్తం చేసారు. ప్రతి రోజు ప్రతి ఇంటీలో గీతా పారాయణం చేయాలనీ కోరటమేకాకుండా భగవద్గీత ను ప్రతి ఒక్కరికి అందచేశారు. ఈ కార్యక్రమానికి షుమారు మూడు వందల మంది భక్తులు హాజరయ్యారు. గీతా పారాయణం అనంతరం అన్న ప్రసాదం అందచేశారు. 

ఇస్కాన్ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమములో ఇస్కాన్ టెంపుల్ ప్రెసిడెండ్ వరద గోపాల్ దాస్ తో పాటు కార్య నిర్వాహకులు సుమధుర చైతన్య దాస్, రాగనుగా భక్తి మాన్ దాస్, విరా.నారాయణ దాస్, రవి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

-- రాజేశ్వర్, మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com